తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి వరకు ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలు తెరకెక్కించారు.  పవన్ కళ్యాన్ తో గతంలో ‘జల్సా’,‘అత్తారింటికి దారేది’చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.  వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయ్యింది.   తీరా థియేటర్లోకి వచ్చిన తర్వాత ఘోర పరాజయం పొందింది.  దాంతో దర్శకులు త్రివిక్రమ్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి.  అందుకే తన తదుపరి చిత్రంపై  ఎక్కువ శ్రద్ద పెట్టి తీస్తున్నారు.   
Image result for venkatesh malleswari
ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపొందుతోంది. దసరాకి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  ఈ చిత్రం పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ తో అల్లు అర్జున్, మహేష్ బాబు లైన్లోకి వస్తారని ఆ మద్య వార్తలు వచ్చాయి.  కానీ  త్రివిక్రమ్ మాత్రం తన తదుపరి సినిమాను వెంకటేశ్ తో చేయనున్నాడు. కొంతకాలం క్రితం వెంకటేశ్ కి త్రివిక్రమ్ ఒక కథ వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. గతంలో వీరిద్దరి కాంబినేష్ లో ‘మల్లీశ్వరి’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. 
Image result for pawan kalyan trivikram
వాస్తవానికి త్రివిక్రమ్ ఈ కథను పవర్ స్టార్ కోసం తయారు చేసిందట..ప్రస్తుతం పవన్ కళ్యాన్ ఎలక్షన్ బిజీలో ఉన్నారు. అయితే ఈ కథ వెంకటేష్ కి వినిపించగా ఆయనకు ఎంతో నచ్చిందట. అందువలన త్రివిక్రమ్ అదే కథను వెంకటేశ్ తో చేయనున్నాడనేది తాజా సమాచారం. ప్రస్తుతం 'ఎఫ్ 2' సినిమా చేస్తోన్న వెంకటేశ్, ఆ తరువాత 'వెంకీమామా' చేస్తూనే త్రివిక్రమ్ ప్రాజెక్టుపై దృష్టిపెడతాడని చెబుతున్నారు.    



మరింత సమాచారం తెలుసుకోండి: