నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ను ప్రారంభించే సమయానికి ఆమూవీపై పెద్దగా అంచనాలు లేవు. అయితే ఈమూవీ ప్రాజెక్ట్ నుండి దర్శకుడు తేజా తప్పుకుని క్రిష్ ఎంటర్ అయిన తరువాత వచ్చిన మార్పులు వల్ల ఈమూవీ ప్రాజెక్ట్ పై విపరీతంగా క్రేజ్ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థుతులలో బాలకృష్ణ తనసొంత బ్యానర్ ను ప్రకటించడమే కాకుండా ఆబ్యానర్ పై ఎన్టీఆర్ బయోపిక్ విడుదల అవుతుందని ప్రకటించడం మరింత సంచలనంగా మారింది.

అంతేకాదు ఈబ్యానర్ వ్యవహారాలు చూసేందుకు బాలయ్య తోడల్లుడు ప్రసాద్ రంగప్రవేశం చేయడంతో ఈమూవీ నిర్మాణంలో లుకలుకలు ప్రారంభం అయ్యాయి అంటూ గాసిప్పుల హడావిడి మొదలైంది. వాస్తవానికి ఈమూవీ నిర్మాతలుగా సాయి కొర్రపాటి విష్ణులు వ్యవహరిస్తున్న నేపధ్యంలో ఈమూవీ కోసం బాలకృష్ణ తనసొంత బ్యానర్ ను క్రియేట్ చేయడమే కాకుండా ఈవ్యవహారాలను బాలయ్య తోడల్లుడు ప్రసాద్ కు ఎందుకు అప్పచెప్పాడు అంటూ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలలో చాలమంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు. 
Haven’t decided on the director but will announce in a few days: Nandamuri Balakrishna about biopic of N.T. Rama Rao
ఇండస్ట్రీలో వినపడుతున్న వార్తల ప్రకారం ఈమూవీ ప్రాజెక్ట్ కు ఎప్పుడైతే క్రిష్ వచ్చాడో ఈమూవీ పై క్రేజ్ ఏర్పడి ఈమూవీకి చాలమంచి లాభాలు వచ్చే ఆస్కారం ఏర్పడింది అనిఅంటున్నారు. దీనితో ఈమూవీ లాభాలను తాను కూడ పొందాలి అన్న ఉద్దేశ్యంతో బాలకృష్ణ తన సొంతబ్యానర్ ను ఏర్పాటు చేసి ఆవ్యవహారాలూ అన్నీ అతడి తోడల్లుడు ప్రసాద్ కు అప్పచెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. వాస్తవానికి ఈప్రాజెక్ట్ లో సాయి కొర్రపాటి విష్ణులు పెద్దగా ఇన్వెస్ట్ చేసింది లేదు అంతా బాలకృష్ణ నేతృత్వంలోనే జరుగుతోంది కాబట్టి ఇలా బాలయ్య నిర్మాతగా రంగప్రవేశం చేసి ఆయన కోటరీ కూడ ఎంటర్ అయింది అని అంటున్నారు.  
బాలకృష్ణ
దీనికితోడు గడచిన నాలుగైదేళ్లుగా బాలకృష్ణతో సినిమాలు చేసి నష్టపోయిన నిర్మాతలే తప్ప లాభాలు పొందిన వారు లేరు అనే మాటలు కూడ ఉన్నాయి. దీనితో నష్టాల ప్రాజెక్ట్ లకు అయితే నిర్మాతలు కావాలి లాభాల ప్రాజెక్టు అయితే సొంతబ్యానర్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.  అంతేకాదు ఇక రానున్నరోజులలో బాలయ్య తనసినిమాలను తన సొంతబ్యానర్ పైనే మాగ్జిమమ్ చేస్తాడని బయట బ్యానర్ లకు మరీ స్క్రిప్ట్ అద్భుతంగా వుంటేనే చేస్తాడని అంటున్నారు. త్వరలో ప్రారంభం కాబోతున్న బాలకృష్ణ బోయపాటిల మూవీ ప్రాజెక్ట్ కూడ బాలయ్య సొంతబ్యానర్ పైనే ఉంటుంది అని అంటున్నారు. ఇలా రకరకాల గాసిప్పులు బాలయ్య సొంత బ్యానర్ పై వస్తున్న నేపధ్యంలో దుబాయ్ లో జరిగిన ‘సైమా’ అవార్డ్స్ ఫంక్షన్ లో ఈగాసిప్పులకు చెక్ పెట్టాడు బాలకృష్ణ. ఎన్టీఆర్ బయోపిక్ కు తనతో పాటు సాయి కొర్రపాటి విష్ణు ఇందూరిలు నిర్మాతలుగా వ్యవహరిస్తారు అంటూ తనకోటరీలో ఎటువంటి మార్పులు లేవు తాను ఎప్పటిలా అందరి వాడిని అన్న సంకేతాలు ‘సైమా’ ఫంక్షన్ సాక్షిగా సంకేతాలు ఇచ్చాడు బాలయ్య..  


మరింత సమాచారం తెలుసుకోండి: