కౌశల్ ‘బిగ్ బాస్ 2’ సీజన్ విన్నర్ అవ్వబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ విపరీతమైన ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కౌశల్ ఒక విషయంలో గీతా మాథురి కన్నా బాగా వెనకపడిన విషయం ఒకటి లీక్ అయింది. తెలుస్తున్న సమాచారం మేరకు ‘బిగ్ బాస్ 2’ షోలో పాల్గొనడానికి గీతా మాధురిని ఒప్పించడానికి స్టార్ మా యాజమాన్యం చాల కష్టపడవలసి వచ్చింది అన్న వార్తలు ఉన్నాయి. 
గీతాకు సోషల్ మీడియా తిప్పలు
ఈషోలో గీతా మాధురిని పాల్గొనేలా ఒప్పించడానికి రోజుకు 20 వేల పారితోషికంతో ఈషోలోకి వచ్చినట్లు టాక్. వాస్తవానికి కౌశల్ ఈషోలోకి వచ్చే ముందు పెద్దగా పేరున్న సెలెబ్రెటీ అవ్వకపోవడంతో గీతా మాధురికి ఇచ్చిన పారితోషికంలో సగం కూడ కౌశల్ కు ఇవ్వకుండా అతడిని ఈషోలోకి రప్పించినట్లు సమాచారం. అయితే ఎవరూ ఊహించని విధంగా కౌశల్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడటంతో ఇప్పుడు అతడి ఇమేజ్ గీతా మాధురిని దాటిపోయింది. 
గీతా కామెంట్లను తప్పుపట్టిన కౌశల్
ప్రస్తుతం ‘బిగ్ బాస్ 2’ సీజన్ చివరి దశకు రావడంతో ఈషోకి సంబంధించి పారితోషికాన్ని పరిగణలోకి తీసుకుంటే కౌశల్ కంటే గీతా మాధురికే ఆర్ధికంగా ‘బిగ్ బాస్ 2’ షో కలిసి వచ్చే షోగా మారిందని కొందరు బుల్లితెర మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇది ఇలా ఉండగా నిన్నరాత్రి ప్రసారం అయిన ‘బిగ్ బాస్ 2’ షోలో నాని గీతా మాధురిని చాలగట్టిగా టార్గెట్ చేసాడు. 
రోల్ నీలో దమ్ము ఉందా?
సోషల్ మీడియా అకౌంట్లు, ట్విట్టర్, ఫేస్ బుక్ ప్రచారంపై గీతా మాధురి మాట్లాడిన విషయాన్ని మొట్టమొదట నానీ పాయింట్ అవుట్ చేస్తూ మీకు బయట సోషల్ మీడియా ప్రచారం గురించి ఎవరు చెప్పారు అని నాని నిలదీయడంతో గీతా మాధురి ఆప్రశ్నకు షాక్ అయి చివరకు తప్పించుకోవడానికి ఈవిషయాన్ని నూతన నాయుడు పై నెట్టేసింది. ప్రస్తుతం ఈషోను చూస్తున్న చాలామంది అమ్మాయిలు మహిళలు గీతా మాధురికి ఓట్లు వేస్తున్న నేపధ్యంలో కౌశల్ గీతా మాధురిల మధ్య వార్ క్లైమాక్స్ కు చేరుకుంది అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: