ఎవరైనా తమ సినిమాల పై నెగిటివ్ కామెంట్స్ వ్రాస్తే భరించలేని కోపంతో మీడియా వర్గాలను హీరోలు టార్గెట్ చేస్తున్న పరిస్థితి. అలాంటి పరిస్థుతులలో వినాయకచవితి రోజున విడుదలైన ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా విషయంలో మీడియా వర్గాలు చేసిన కామెంట్స్ ను స్వీకరించడమే కాకుండాఏకంగా క్షమించమని నాగచైతన్య అడగడం ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

చైతన్య కెరియర్ లో అత్యధిక ఓపెనింగ్స్ ఇచ్చిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ పై మీడియా చాల నెగిటివ్ రివ్యూలు వ్రాసిన విషయం తెలిసిందే. అయితే అలా తన సినిమా పై నెగిటివ్ రివ్యూలు వ్రాసిన మీడియా వర్గాలకు నాగచైతన్య ఓపెన్ గా సారీ చెప్పడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. "రిలీజైన పొద్దున్న కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. కొంతమంది సమీక్షకుల్ని సంతృప్తి పరచలేకపోయాను. నన్ను క్షమించండి. నెక్ట్స్ మూవీకి మరింత కష్టపడతాను." అంటూ చైతన్య ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. 
Naga Chaitanya Sailaja Reddy Alludu Song Shoot In Goa - Sakshi
గతంలో అనేకమంది టాప్ హీరోలు తమ సినిమాలకు నెగిటివ్ రివ్యూలు వస్తే చాలు మీడియా పై మాటల దాడి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గత సంవత్సరం విడుదలైన అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాధం’ పై నెగిటివ్ రివ్యూలు వచ్చినప్పుడు బన్నీతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడ మీడియాను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ కూడ తన సినిమాల పై నెగిటివ్ రివ్యూలు వ్రాసిన వారి పై తీవ్ర అసహనం వ్యక్త పరిచిన సందర్భాలు కూడ ఉన్నాయి. 
OMG! People spent 85 billion hours on WhatsApp in 3 months
అయితే దీనికి భిన్నంగా చైతన్య ఒక స్టార్ కుటుంబం నుండి వచ్చినా వాస్తవాలను గ్రహించి నిజాలు మాట్లాడటం అతడి మంచి తనానికి నిదర్సనం అంటూ మీడియా చైతూ పై ప్రశంసలు కురిపిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈమూవీ సక్సెస్ మీట్ ను రాత్రి నిర్వహించారు. ఆ సమావేశంలోనే నాగచైతన్య ఇలా మాట్లాడాడు. చైతు కొత్త వ్యూహం నేటి తరం యంగ్ హీరోలకు ఒక పాఠం అంటూ నిన్నటి సమావేశాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా వర్గాలు కామెంట్ చేసినట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: