నాగ చైతన్య నటించిన లేటెస్ట్ సినిమా శైలజా రెడ్డి అల్లుడు సినిమా రిలీజ్ అయ్యింది. సినిమా కు భారీ ఓపెనింగ్స్ వచ్చిన అందరికీ ఈ సినిమా నచ్చలేదు. చైతూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ సినిమా మాత్రం అందరికీ ఆమోదయోగ్యంగా లేదు. కొందరికి ఇది నచ్చలేదు. దీనిపై నెగెటివ్ గా రివ్యూస్ కూడా వచ్చాయి. అలా తన సినిమాపై నెగెటివ్ గా రివ్యూస్ రాసిన సమీక్షకులకు నాగచైతన్య సారీ చెప్పాడు.

Image result for nagachaitanya

"రిలీజైన పొద్దున్న కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. కొంతమంది సమీక్షకుల్ని సంతృప్తి పరచలేకపోయాను. నన్ను క్షమించండి. నెక్ట్స్ మూవీకి మరింత కష్టపడతాను." ఇది నాగచైతన్య స్టేట్ మెంట్. ఈసారి రివ్యూలు మెచ్చేలా మరింత కష్టపడి ఓ మంచి సినిమా చేస్తానంటున్నాడు చైతూ. గతంలో నెగెటివ్ రివ్యూస్ రాసిన వాళ్లపై స్టార్ హీరోలే విరుచుకుపడిన సందర్భాలున్నాయి. డీజే సినిమాపై నెగెటివ్ రివ్యూస్ వస్తే అనరాని మాటలన్నాడు బన్నీ.

Image result for nagachaitanya

ఎన్టీఆర్ కూడా గతంలో ఓసారి రివ్యూవర్స్ పై విరుచుకుపడ్డాడు. కానీ చైతూ మాత్రం సారీ చెప్పి అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు.  సినిమా సక్సెస్ మీట్ ను రాత్రి నిర్వహించారు. ఆ సమావేశంలోనే నాగచైతన్య ఇలా రెస్పాండ్ అయ్యాడు. హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్, దర్శకుడు మారుతి, కమెడియన్ పృధ్వి, సీనియర్ నటుడు నరేష్, నిర్మాతలు ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: