తెలుగు ఇండస్ట్రీలో ‘సీతాకోక చిలుక’ చిత్రంతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆలీ  తర్వాత స్టార్ కమెడియన్ గా మారిపోయాడు.  కమెడియన్ గానే కాకుండా కొన్ని చిత్రాల్లో హీరోగా కూడా నటించాడు.  ప్రస్తుతం వెండి తెరపైనే కాదు బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నాడు.  పలు సీనీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.  తాజాగా ఇప్పుడు తన తమ్ముడు ఖయ్యూమ్ కోసం సమర్పకుడిగా కూడా మారారు ఆలీ .  ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ ఇస్తున్న తరుణంలో ఆలీ సోదరుడు ఖయ్యూం  కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు. 

పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వస్తున్నారు.  తాజాగా ఖయ్యూం హీరోగా ‘దేశంలో దొంగలు పడ్డారు’చిత్రం లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు మరణంతో పెద్దదిక్కుగా మారారు మెగాస్టార్ చిరంజీవి.  అందుకే ఆయన సమక్షంలో ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేయించాడు ఆలీ.  మొదటి నుంచి మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉంటు వస్తున్న విషయం తెలిసిందే. 

ఆలీ స‌మ‌ర్ప‌ణ‌లో ఖ‌య్యూం ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న సినిమా "దేశంలో దొంగ‌లు ప‌డ్డారు". సీనియ‌ర్ న‌టులు సమీర్, పృథ్వీ ముఖ్య పాత్రలు పోషించారు.  గౌతం రాజ్‌కుమార్ టీం ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్ర ట్రైల‌ర్ చిరంజీవి చేతుల మీదుగా విడుద‌లైంది. అలీతో ఆయ‌నకి ఉన్న ప‌రిచ‌యం సాన్నిహిత్యం కార‌ణంగా ఈ దొంగ‌ల‌ను బాగానే ఎంక‌రేజ్ చేస్తున్నాడు మెగాస్టార్.

ఈ సినిమా ట్రైల‌ర్‌కు రామ్ గోపాల్ వ‌ర్మ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఆయ‌న కూడా ట్విట్ట‌ర్‌లో ఈ ట్రైల‌ర్ షేర్ చేసాడు. పైగా క‌థ కూడా కొత్త‌గా ఉంది. క‌థ‌నం కూడా ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది. మరి అంతగొప్ప దర్శకులే మెచ్చుకున్నారంటే ఈ చిత్రంలో ఏదో విషయం ఉందని అంటున్నారు..తెలుగు సినీ ప్రేక్షకులు..అందుకే ట్రైలర్ ని విపరీతంగా వీక్షిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: