తెలుగు, తమిళ సినిమాల్లో ఇప్పటి వరకు బిజీ హీరోయిన్లు ఎవరంటే అతి కొద్ది మందే ఉన్నారు..వారిలో నయనతార ఒకరు. రజినీకాంత్ సరసన ‘చంద్రముఖి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నయన తార ఆ సినిమాలో ఎంతో సాంప్రదాయంగా కనిపించింది. ఆ తర్వాత సూర్య నటించిన ‘గజిని’ సినిమాలో హాట్ హాట్ గా దర్శనమిచ్చి యువత మనసు దోచింది. అప్పటి నుంచి అగ్ర హీరోలతో వరుసగా విజయాలు అందుకొని దక్షిణాది టాప్ హీరోయిన్ గా మారిపోయింది.
అంతే కాదు దక్షిణాదిన ఎక్కువ రెమ్యూనరేషన్ దాదాపు 3 కోట్లకు పై గా వసూళ్లు చేసిన క్రెడిట్ కూడా నయనతారకే దక్కుతుంది. నటన పరంగా ఈమె ఎంత సక్సెస్ సాధించినా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో అఘాదాలు చూసింది..మొదట శింబుని ప్రేమించి దూరమైంది..తర్వాత దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవతో నిశ్చితార్థం వరకు వచ్చి క్యాన్సల్ అయ్యింది..ప్రస్తుతం దర్శకుడు విగ్నేష్ తో ప్రేమాయణం కొనసాగిస్తుంది.
తాజాగా నయనతార బిహేవియర్ గురించి కామెడీ దర్శకుడు మారుతి సంచలన వ్యాఖ్యలు చేశారు. నయనతార బిహేవ్ సరిగా లేదని నాలాంటి చిన్న వాళ్లకు గౌరవం ఇవ్వకపోయినా ఫరవాలేదు కానీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరోని స్టార్ హీరోని గౌరవించాలా ? లేదా ? కానీ నయనతార మాత్రం ఘోరంగా బిహేవ్ చేసిందని సంచలన వ్యాఖ్యలు చేసాడు మారుతి.
ఆ మద్య వెంకటేష్ – నయనతార జంటగా ‘బాబు బంగారం’ అనే చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నయనతార చాలా రూఢ్ గా వ్యవహరించిందని..తాను ఒక చిన్న దర్శకుడని తనకు గౌరవం ఇవ్వకున్న పరవాలేదు..స్టార్ హోదాలో ఉన్న వెంకటేష్ ను సైతం కొన్ని సార్లు లెక్కచేయకపోవడంతో ఆమెతో గొడవ పెట్టుకున్నానని అన్నారు.
తెలుగులో పలు చిత్రాల్లో నటించిన నయనతార ఇక్కడ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూ హీరోలను లెక్కచేయకుండా అవమానిస్తోంది అంతేకాదు సినిమా చేస్తాను తప్ప ప్రమోషన్ కార్యక్రమాలకు రానని కూడా తేల్చి చెప్పేస్తోంది . ఇంతగా అవమానిస్తున్నా కూడా మళ్ళీ ఆ భామనే పెట్టి మరీ సినిమాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు అందుకే అలా బిహేవ్ చేస్తోంది నయనతార .