తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 త్వరలో ముగియబోతుంది. పదిహేడు మందితో మొదలైన బిగ్ బాస్ 2 జర్నీ నిన్నటితో ఆరుగురికి చేరింది. నిన్న ఎలిమినేషన్ రౌండ్ లో కౌశల్, దీప్తి, గీతామాధురి,రోల్ రైడాలు సేఫ్ జోన్ లోకి వెళ్లగా..రాముడు మంచి బాలుడు అనిపించకుంటూ వచ్చిన అమిత్ తివారీ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆదివారం నాటి 99వ ఎపిసోడ్లో ‘నీ మంచికోరి’ అనే సరదా సరదా టాస్క్లో ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఓ వైట్ బోర్డుపై ఇంటి సభ్యుల గురించి తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ వారి లక్షణం రాసి ఉన్న ప్లేట్ను బోర్డుపై అతికించాలి. అలా ఒక్కక్కొరి గురించి తమ అభిప్రాయాన్ని చెప్పి ప్లేట్ రూపంలో అతికించారు.
ఇంటిలో దాదాపు ప్రతీ ఒక్కరు కౌశల్కు వ్యతిరేకంగా నెగిటివ్ కామెంట్లు విసిరారు. అహం, అత్యాశ, మాట మీద ఉండడు అనే కామెంట్లను వదిలారు. అలా ఒకరిపై మరొకరు తమ ఫీలింగ్స్ను ప్రకటించుకొన్నారు. ఇక దీప్తి వంతుకు వచ్చినప్పటి నుంచి ఆమె అదే పనిగా మాట్లాడటం మొదలు పెట్టారు. ఇక దీప్తి పెట్టిన నస అంతా ఇంతా కాదు..ఆమె కంటిన్యూగా మాట్లాడం మొదలు పెట్టేసరికి ఇంటి సభ్యులకు విసుగు కలిగి ఒక్కొక్కరూ అటూ ఇటూ తిరగడం మొదలు పెట్టారు.
కౌశల్ నేలపై పడుకొని గిల గిలా కొట్టుకున్నాడు..రోల్ రైడా, అమిత్, సామ్రాట్ నీ నస ఆపు తల్లోయ్ అని బదిలాడినా..దీప్తి మాత్రం అలాగే మాట్లాడుతూ వెళ్లింది.
దాంతో స్టేజ్ పై ఉన్న నాని కి కూడా బాగా విసుగు అనిపించింది..కొద్దిసేపు కింద కూర్చున్నాడు..బిగ్ బాస్ తలుపు తీస్తే నేను వెళ్లిపోతా బాబోయ్ అంటూ అందరినీ నవ్వించారు. అయినా నాన్ స్టాప్గా మాట్లాడుతూ అందర్నీ విసిగించింది. మొత్తానికి గేమ్ ముగిసిన తర్వాత నాని ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.