నేడు ప్రపంచం టెక్నాలజీ రంగంలో ఎన్నో విజయాలు సాధించింది..అంతరిక్ష రహస్యాలను ఛేదిస్తున్నాయి.  భూమి, నేల, ఆకాశాన్ని తమ హస్తగతం చేసుకున్నాయి..అలాంటిది భారత్ లో మాత్రం ఇంకా కులాలు, మతాలు అంటూ కొట్టుకొని ఛస్తున్నారు.  తాజాగా తన కూతురు అమృత తమ కంటే తక్కువ కులం వ్యక్తి ప్రణయ్ ని ప్రేమించి, పెళ్లాడిందనే కక్షతో ఆమె తండ్రి పరువుహత్యకు పాల్పడిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మిర్యాలగూడలో జరిగిన ఈ హత్యోదంతంపై సినీ నటుడు మంచు మనోజ్ భావోద్వేగంతో ట్విట్టర్ ద్వారా ఓ లేఖను రాశాడు. 


మానవత్వం కంటే కులం, మతమే ఎక్కువని భావించే వారికే ఈ లే ! 


ఏ ఫీల్డ్ లో అయినా.. కాస్ట్ ఫీలింగ్ దానిపై ఆధారపడిన సినీ నటులు, రాజకీయ పార్టీలు, కాలేజ్ యూనియన్లు, కుల, మత సంస్థలన్నీ అనాగరికమైనవి. కులాన్ని సమర్ధించే వారంతా ప్రణయ్ అతని లాంటి చాలా మందిపై జరుగుతున్న దాడులకు బాధ్యత వహించాలి.   జీవిత విలువని ముందుగా మీరు తెలుసుకోవాలి. మనిషి జీవితం కంటే మరేదీ ఎక్కువ కాదనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం.  తన తండ్రిని స్పర్శించక ముందే ఒక బిడ్డ కన్న తండ్రిని కోల్పోవడం మనస్సును కలచి వేసే అంశం. కేవలం కులం కోసం వాళ్ల జీవితాలను ఛిన్నాభిన్నం చేశారు. వారి జీవితాల కంటే మీకు కులమే ఎక్కువా? మన అందరికీ ఒకేలాంటి గుండె, శరీరం ఉన్నాయి.
Image result for pranay murder
మనం పీల్చే గాలి కూడా ఒక్కటే. కానీ, కులం, మతం పేరుతో మరొకరి పట్ల అమానుషంగా ప్రవర్తించడం ఎంత వరకు సబబు? మనుషులంతా ఒకటే అనే విషయాన్ని ఈ ప్రపంచం ఎప్పుడు తెలుసుకుంటుంది? కుల ప్రేమికులను, మద్దతుదారులను చూసి సిగ్గుపడుతున్నా.  ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తే కాకుండా... కులాలను అమితంగా ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ ఘటనకు బాధ్యులే. కుల వివక్ష నశించాలి.    కులపిచ్చిని రూపుమాపుదాం. ఇది నివారించాల్సిన పెద్ద రోగం. కాస్త కళ్లు తెరచి మనుషుల్లా ప్రవర్తించండి.

మీ అందరినీ మనస్ఫూర్తిగా అర్ధిస్తున్నాను. మన పిల్లలకి మంచి సమాజాన్ని అందిద్దాం. ప్రణయ్ భార్య అమృత, అలాగే అతని కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేస్తున్నాను'' అంటూ పేర్కొన్నారు.    అమృత పరిస్థితి నన్ను ఎంతగానో కలచి వేసింది. ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" అంటూ ట్విట్టర్ ద్వారా మనోజ్ తన భావోద్వేగాన్ని వ్యక్తపరిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: