నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో టైటిల్ ఎవరు గెలుస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రస్తుతం హౌజ్ లో ఉన్న ఆరుగురు కంటెస్టంట్స్ లో కౌశల్ స్ట్రాంగ్ హౌజ్ మెట్ గా కౌశల్ కనిపిస్తున్నాడు. అయితే మిగతా వాళ్లలో గీతా మాధురి, తనీష్ లు కూడా టైటిల్ రేసులో ఉన్నారు.


ఇక ఈ శనివారం ఎలిమినేట్ అయిన అమిత్ కు బయటకు వచ్చాక కౌశల్ స్టామినా ఏంటో తెలిసింది. కౌశల్ ఆర్మీ ప్రభావం.. కౌశల్ కు బయట ఏర్పడిన క్రేజ్ చూసి అమిత్ షాక్ అయ్యాడని తెలుస్తుంది. హోస్ట్ నాని టాప్ త్రీలో ఎవరెవరు ఉంటారని అడిగితే రోల్ రైడా, గీతా మాధురి, సామ్రాట్ అని చెప్పిన అమిత్ బయటకు వచ్చాక తన మాట మార్చేశాడు. 


కౌశల్ ఆర్మీ ప్రభావం చూసి అమిత్ బిగ్ బాస్ విన్నర్ అయ్యేది కౌశల్ అంటూ చెబుతున్నాడు. అయితే గీతా మాధురికి మళ్లీ ఛాన్స్ ఉందని అన్నాడు. బయటకు వచ్చాక అమిత్ అంచనాలు తారుమారయ్యాయి. కౌశలే బిగ్ బాస్ విన్నర్ అని తాను ఫిక్స్ అయ్యాడని అనిపిస్తుంది. అందుకే అమిత్ నాని ముందు చెప్పిన ముగ్గురిలో గీతాని తప్ప ఎవరిని ప్రస్థావించలేదు. 


ఇక బిగ్ బాస్ కూడా హౌజ్ మెట్స్ మధ్య ఫైట్ మరింత టఫ్ చేస్తున్నాడు. ఈరోజు ఎపిసోడ్స్ లో తనీష్, కౌశల్ మధ్య వాగ్వివాదం మరింత ముదిరిందని తెలుస్తుంది. ఇసుకని కాపాడుకునే టాస్క్ లో ఇద్దరు దాదాపు కొట్టుకునే పరిస్థితికి వచ్చారని ప్రోమో చూస్తే అర్ధమవుతుంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: