యంగ్ హీరో సుధీర్ బాబు ప్రిన్స్ మహేష్ బావగా కాకుండా తనను తానుగా గుర్తించమని అనేక సందర్భాలలో ఓపెన్ గానే చెప్పాడు. అయితే ఈవిషయాలను మహేష్ అభిమానులు పెద్దగా పట్టించుకోలేదు దీనితో సుధీర్ బాబు ఇప్పుడు తన వ్యూహాలను మార్చి ఏకంగా మహేష్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. మరోరెండు రోజులలో విడుదల కాబోతున్న సుధీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. 

మహేష్ ను అతిధిగా పిలవకుండా ఇప్పటి వరకు సుధీర్ బాబు నటించిన ఏమూవీ ఫంక్షన్స్ జరగలేదు. అయితే ఈసెంటిమెంట్ ను బ్రేక్ చేసి ఎక్కడా మహేష్ ప్రస్తావన లేకుండా ఈ మూవీ ఫంక్షన్ ను నిర్వహించి మహేష్ లేకుండానే కేవలం తన ఇమేజ్ తో తన సినిమాను ప్రమోట్ చేసిన సందర్భం అందర్నీ ఆశ్చర్య పరిచింది. 
Mahesh Babu in Bharat Ane Neenu. Image via Twitter
వాస్తవానికి గతంలో ఎన్నో సార్లు మహేష్ సుధీర్ బాబు సినిమాల ఫంక్షన్స్ కు అతిధిగా వచ్చి తన బావను ఎంతో పొగిడినా మహేష్ అభిమానులు కూడ పెద్దగా పట్టించుకోకపోవడంతో సుధీర్ బాబు ఈనిర్ణయం తీసుకుని ఉంటాడు అని అంటున్నారు. ఇతడి లేటెస్ట్ మూవీ ‘సమ్మోహనం’ కు మంచి టాక్ వచ్చినా చెప్పుకో తగ్గ కలక్షన్స్ రాకపోవడంతో ఇకలాభం లేదనుకుని తానే నిర్మాతగా మారి డిఫరెంట్ సినిమాను తీసి హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు సుధీర్ బాబు.  
Sudheer Babu confident about Nannu Dochukunduvate
దర్శకుడు ఆర్ఎస్ నందు దర్శకత్వం వహించిన ఈమూవీ పై ఇండస్ట్రీ ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ ఉంది. గతహవారం విడుదలైన ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోవడంతో ఈ డిఫరెంట్ మూవీ ఖచ్చితంగా యూత్ కు బాగా నచ్చుతుందని సుధీర్ బాబు ఆశ పడుతున్నాడు. దీనితో మహేష్ లేకుండా చేసిన ఈ మూవీ ప్రమోషన్ అయినా సుధీర్ బాబుకు కలిసిరాకపోతే ఇండస్ట్రీలో నడుస్తున్న విపరీతమైన పోటీలో నిలదొక్కుకోవడం కష్టమే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: