తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 మరి కొద్ద రోజుల్లో పూర్తి కాబోతుంది.  ప్రస్తుతం  బిగ్ బాస్ హౌజ్ లో కౌశల్, తనిష్, రోల్ రైడా, సామ్రాట్, దీప్తి నల్లబొతు, గీతా మాధురి.  కాగా ఈ వారం అందరూ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం బిగ్ బాస్ లో గెలుపు ప్రయత్నాలు అందరూ చాలా సీరియస్ గానే చేస్తున్నట్లు కనిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలేకి చేరుకోవడంతో కంటెస్టెంట్స్ మధ్య హోరా హోరీ పోరు నడుస్తుంది. కౌశల్ టార్గెట్‌గా మాటల యుద్ధం ప్రకటించిన మిగిలిన కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌ సాయంతో ఫిజికల్ అటాక్‌కి దిగారు. 


గ్రాండ్ ఫినాలేకి ఎంటర్ కావడంతో కంటెంస్టెంట్‌కు ‘మీ ఇసుక జాగ్రత్త’ అనే ఫిజికల్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో గెలిపొందిన విజేతకు ఎలిమినేషన్ నుండి మినహాయింపు ఇవ్వడంతో పాటు.. డైరెక్ట్‌ ఫినాలేకి వెళ్లే అవకాశాన్ని కల్పించారు బిగ్ బాస్. మొదటి లెవల్‌లో కౌశల్, గీతా, రోల్ రైడా ఇసుకను కాపాడుకుంటూ ఉంటాలి. మిగిలిన వాళ్లు ఆ ఇసుకుని తొలగించే ప్రయత్నం చేశాలి.  ‘మీ ఇసుక జాగ్రత్త’ లెవల్ 1లో కౌశల్, గీతా, రోల్ రైడా ఇసుకను కాపాడుకుంటే.. దీప్తి, తనీష్, సామ్రాట్‌లు ఆ ఇసుకను కిందకు పడేసే ప్రయత్నం చేశారు. తొలిత రోల్ రైడా ఇసుకను కిందపడేసిన తనీష్.. తరువాత సామ్రాట్‌తో కలిసి రోల్ రైడాను గెలిపించే ప్రయత్నం చేశారు.


ఇద్దరూ కలిసి రోల్ రైడాను సేవ్ చేసేందుకు కౌశల్‌ని టార్గెట్ చేశారు. అంతే కౌశల్ కి ఎక్కడో మండింది..ఇలా డీల్ చేసుకుంటే గేమ్ ఎందుకూ..అని రోల్ రైడా ఇసుక తొలగించేందుకు ప్రయత్నంచాడు. ఈ క్రమంలో తనీష్, కౌశల్‌లు కొట్టుకునేందుకు రెడీ అయ్యారు. ఏయ్..ఏయ్..ఒకరిపై ఒకరు  బలాబలాలను ప్రదర్శించుకునేందుకు సిద్ధం అవ్వడంతో అలర్ట్ అయిన బిగ్ బాస్ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక దీప్తి, గీతల మధ్య కూడా ఈ గేమ్ హోరా హోరీగా సాగింది. ఇద్దరూ బలప్రదర్శనకు దిగారు.  ఇక ఎన్నిసార్లు హెచ్చరించినా కౌశల్, తనీష్‌లు శారీరక హింసకు పాల్పడుతున్నారంటూ బిగ్ బాస్ హెచ్చరించి.. చివరి అవకాశం ఇచ్చారు. ఇక రోల్ రైడాను ‘మీ ఇసుక జాగ్రత్త’ లెవల్ టు మొదటి పోటీదారుడిగా ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: