ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ల హవా బాగా నడుస్తుంది. రకూల్ ప్రీత్, రెజీనా, రాశీఖన్నాల తర్వాత ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మానుయేల్ , మెహ్రీన్, సాయి పల్లవి, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు తమ సత్తా చాటుతున్నారు. కామెడీ దర్శకుడు మారుతి దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, అను ఇమ్మానుయేల్ జంటగా నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంపై మొదటి నుంచి మంచి అంచనాలు వచ్చినప్పటికీ..రిలీజ్ అయిన తర్వాత మిశ్రమ స్పందన వచ్చింది.
ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. అయితే తెలుగులో ఈ ఏడాది వరుస మూవీలు చేస్తున్న అను ఇమ్మానుయేల్ ప్రస్తుతం కోలీవుడ్పై దృష్టిసారిస్తోంది. ‘తుప్పరివాలన్’లో స్టార్ హీరో విశాల్కు జోడీగా నటించి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ధనుష్ దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రంలోనూ అను ఇమ్మానుయేల్ నటిస్తుంది. అంతే కాదు మరికొన్ని చిత్రాలకు సైన్ కూడా చేసినట్లు సమాచారం. సాధారణంగా ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి హీరోయిన్ ఎవరితోనైనా ఒకరితో ఎఫైర్ కొనసాగిస్తున్నారని వార్తలు వస్తూనే ఉంటాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రేమ గురించి ప్రస్తావించినపుడు.. ప్రేమ, పెళ్లి విషయాలపై అను ఇమ్మానుయేల్ నిర్మొహమాటంగా మాట్లాడేసింది. కాలేజీ రోజుల్లో నాకు నలుగురు అబ్బాయిలు లవ్ ప్రపోజ్ చేశారు. ప్రేమ అంటే రెండు మనసులు కలవాలి. ఇద్దరి హృదయాల్లో ఆ భావన కలగాలి. నేను కూడా భవిష్యత్తులో ప్రేమించి పెళ్లి చేసుకుంటానని తన మనసులో మాట చెప్పేసింది ఆ నిషాకళ్ల సుందరి.