తెలుగు ఇండస్ట్రీలో మాస్ మహరాజుగా ప్రేక్షకులకు దగ్గరైన రవితేజ నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ కావడంతో రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ‘రాజా ది గ్రేట్ ’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు.  ఈ చిత్రంలో రవితేజ అంధుడిగా కనిపించినప్పటికీ తనదైన హీరోయిజం..మానరీజం చూపించి సూపర్ హిట్ అందుకున్నాడు.   ఆ తర్వాత వచ్చిన  ‘టచ్ చేసి చూడు’ ‘నేలటికెట్’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లను మూట కట్టుకున్న విషయం తెల్సిందే.  ప్రస్తుతం  శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. 

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘దుబాయ్ శీను’ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.   ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రానికి సంబందించిన షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.   వచ్చే నెలలో ఈ చిత్రం విడుదలకు రెడీ చేస్తున్నారు. ఈ సమయంలోనే రవితేజ తర్వాత చిత్రాల గురించి ఇండస్ట్రీలో రక రకాల వార్తలు వస్తున్నాయి.  ‘టచ్ చేసి చూడు’ ‘నేలటికెట్’ భారీ డిజాస్టర్ తో భయపడ్డ రవితేజ త్వరలో రాబోతున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ రిజల్ట్ ఎలా ఉండబోతుందో అన్న టెన్షన్ లో ఉన్నాడట.

ఇదిలా ఉంటే..తమిళ సూపర్ హిట్ మూవీ ‘తేరీ’ని రవితేజ రీమేక్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.  సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ ‘తేరీ’ రీమేక్ ను చేయాలని మొన్నటి వరకు భావించాడు.  కానీ రీమేక్ విషయంలో రవితేజ ఇప్పుడు ఆలోచనలో పడ్డట్లు సమాచారం. తన  తదుపరి చిత్రాన్ని కూడా ప్రయోగాత్మకంగా చేస్తే కెరీర్ ట్రబుల్స్ లో పడే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నాడట.

‘తేరీ’ రీమేక్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్న దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో తాజాగా కొత్త కథను సిద్దం చేయమని చెప్పాడట.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంను దసరాకు పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.  ఇక ముందు ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా మంచి కథను ఎంచుకొని నటించాలని గట్టిగా నిర్ణయించుకున్నారట రవితేజ. 


మరింత సమాచారం తెలుసుకోండి: