తమిళ ఇండస్ట్రీలో మహానటులుగా పేరు పొందిన ఎంజీఆర్ కేవలం నటుడిగానే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన మార్క్ చాటుకున్నారు.  పేద ప్రజల పాలిట దేవుడిగా భావిస్తారు..ఆయన స్థాపించిన అన్నాడీఎంకె పార్టీ పగ్గాలు ఆయన వారసురాలిగా జయలలిత స్వీకరించారు.  తాజాగా ఎంజీఆర్  అభిమానులకు ఓ గుడ్‌ న్యూస్‌. మళ్లీ తెరపై తమ అభిమాన నటుణ్ణి చూసుకొనే అవకాశం ఉంది. 

తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా వెలుగొందిన ఆయన తర్వాత రాజకీయాల్లో  ముఖ్యమంత్రి హోదాను అందుకొని తమిళనాట చిరస్థాయి ఖ్యాతిని గడించారు యంజీఆర్‌. ఆరెంజ్‌ కంట్రీ అనే ఓ మలేషియన్‌ కంపెనీ యంజీర్‌ను తిరిగి తెర మీదకు తీసుకురావడానికి ప్లాన్‌ చేస్తోంది.

‘నరసింహా, చంద్రముఖి’ వంటి హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన పి.వాసుని దర్శకత్వంలో యన్‌ ఫేస్‌ టెక్నాలజీ ద్వారా యంజీర్‌ను తిరిగి  స్క్రీన్‌ మీద చూపించబోతున్నట్లు సమాచారం. 22 మిలియన్‌ డాలర్స్‌ బడ్జెట్‌తో తెరకెక్కబోయే ఈ ప్రాజెక్ట్‌ను ప్రాంతీయ భాషల్లోని నటులతో షూట్‌ చేయనున్నాం అని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: