తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు తల్లి మంచు లక్ష్మమ్మ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. దీంతో మంచు కుటుంబం తిరుపతికి బయలుదేరింది.  కాగా మంచు మోహన్ బాబు విదేశాల్లో ఉండగా విషయం తెలిసిన వెంటనే బయలు దేరారు.   తన నానమ్మ చనిపోయిందని మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో ఎమోషనల్ ట్వీట్ పెట్టారు. నెటిజన్లు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.  అయితే అదే సమయంలో మంచు లక్ష్మీ పెట్టిన ట్వీట్ అభిమానుల చిర్రెత్తుకొచ్చి విమర్శలు చేస్తున్నారు.  


విషాద సమయంలోనూ ఆమె తన సినిమాను ప్రమోట్ చేసుకుంటూ ట్వీట్ చేయడాన్ని తప్పుబడుతున్నారు.  అసలు విషయానికి వస్తే..తమిళంలో ఆమె నటించిన 'కాట్రిన్ మోఝి' అనే సినిమా ట్రైలర్ విడుదల కానుండడంతో ఆమె దీనికి సంబంధించి ఓ ట్వీట్ పెట్టింది.  ''తమిళంలో నా తొలి సినిమా ట్రైలర్ చూడకుండాఉండలేకపోతున్నా.. కాట్రిన్ మోఝి ట్రైలర్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ అవుతుందని'' ట్వీట్ చేశారు. 

అంతే ఈ ట్విట్ చూసిన నేటిజన్లు ఒక్కసారే ఆగ్రహానికి గురయ్యారు. ఓ వైపు  నానమ్మ చనిపోయినా సినిమా ప్రమోషన్లలో బిజీగా ఎలా ఉంటున్నావంటూ నెటిజన్లు మంచు లక్ష్మీపై ఫైర్ అవుతున్నారు. నీకోసం రెండు నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటామంటూ ఘాటుగా ట్వీట్లు చేస్తున్నారు. బాలీవుడ్ లో సక్సెస్ అయిన 'తుమ్హారీ సులు' సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. జ్యోతిక ప్రధాన పాత్రలో కనిపిస్తుండగా మంచు లక్ష్మీ.. జ్యోతికకు బాస్ పాత్రలో కనిపించనున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: