మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథతో వస్తుందని తెలిసిందే. ఇప్పటికే 30 శాతం షూటింగ్ కంప్లీట్ చేసిన ఈ సినిమా యుద్ధ సన్నివేశాలకు జార్జియా వెళ్లడం విశేషం.


ఇక ఈ సినిమాకు మొదటి నుండి ఓ కన్ ఫ్యూజన్ మొదలైంది.. ఇంత పెద్ద ప్రాజెక్ట్ సూరి, రాం చరణ్ ఎలా మొదలు పెట్టారు.. వారి వెనుక ఎవరున్నారు అన్న డౌట్ వచ్చింది. అయితే ఈ డౌట్లు క్లారిఫై చేసుకునే టైం వచ్చింది. 200 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిర్మాత డివివి దానయ్య ఉన్నాడని అంటున్నారు.


నిర్మాణ వ్యహానికి కావాల్సిన సపోర్ట్ అంతా దానయ్య ఇస్తున్నాడట. ఫైనాన్స్ రూపంలో ఇస్తున్నాడా లేక సినిమా బిజినెస్ టైంలో సెటిల్ చేసుకోవచ్చని ఇస్తున్నాడా తెలియదు కాని ప్రస్తుతం దానయ్య బడ్జెట్ తోనే సైరా షూటింగ్ చేస్తున్నారట. ప్రస్తుతం రాం చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమాను నిర్మిస్తున్నాడు డివివి దానయ్య.


సో మొత్తానికి అటు చరణ్ సినిమాతో పాటుగా చిరు సైరా మూవీకి అండగా ఉన్నాడు దానయ్య. 2019 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న సైరా సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన టీజర్ అంచనాలను పెంచేసింది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: