ఈ మద్య సినిమా హీరోలు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోల్లా నిరూపించుకుంటున్నారు. రీసెంట్ గా వచ్చిన కేరళా వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు లక్షల్లో విరాళాలు ఇచ్చారు. తమ అభిమానులు ఏదైనా బాధల్లో ఉంటే వారి వద్దకు వెళ్లడం..వారి బాగోగులు తెలుసుకొని వారికి మంచి గిఫ్ట్ ఇచ్చి ఆనంద పర్చడం చూస్తూనే ఉన్నాం. తమిళ హీరో సూర్య తనను కలవాలనుకున్న ఓ చిన్నారిని ఇంటికి పిలిపించుకొని మరీ అతనితో గడిపి..సెల్ఫీ ఫోటో తీసుకొని సంతోషపరిచాడు.
తాజాగా యల్ లైఫ్ లో కూడా హీరోనే అని అక్షయ్ కుమార్ మరోసారి నిరూపించుకున్నాడు. యాసిడ్ దాడికి గురై.. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న లక్ష్మి అగర్వాల్కి రూ.5 లక్షలు సాయం అందించాడు. ఓ వార్తా పత్రిక ద్వారా ఆమె గురించి తెలుసుకున్న అక్షయ్ కుమార్ వెంటనే స్పందించి..సదరు బాధితురాలికి తనవంతు సాయం అందించి.. మరికొందరు ముందుకొచ్చి ఇలాంటి వారిని ఆదుకునేలా మానవత్వాన్ని చూపించాడు.
సాయం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన అక్షయ్ కుమార్.. 'నేను చేసిన సాయం చాలా చిన్నది. ఇది పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదని..సమాజంలో మహిళలు ఉన్నత స్థాయికి వెళ్లాలని..ఆత్మస్థైర్యంతో లక్ష్మి అగర్వాల్ ముందుకు సాగుతుందని..ఆమెను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. లక్ష్మి గౌరవంగా జాబ్ సంపాదించాలనీ.. ఈలోగా ఇంటి అద్దెతో పాటు తన బిడ్డను పోషించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులూ పడకూడదనే ఉద్దేశంతో ఆమెకు నా వంతు సాయం అందించాను' అని అక్షయ్ కుమార్ చెప్పాడు.