మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీగా వచ్చిన ఖైది నంబర్ 150 సినిమా మరోసారి చిరంజీవి సత్తా ఏంటో బాక్సాఫీస్ వద్ద చూపించింది. ఈ సినిమాతో కొణిదెల ప్రొడక్షన్స్ స్థాపించి నిర్మాతగా కొత్త అవతారం ఎత్తాడు రాం చరణ్. ప్రస్తుతం ఇదే నిర్మాణ సంస్థ నుండి సైరా నరసింహా రెడ్డి సినిమా తెరకెక్కుతుంది.


అయితే ఈ సినిమా తర్వాత కొణిదెల ప్రొడక్షన్స్ లో ఎన్.టి.ఆర్ సినిమా ఉంటుందని లేటెస్ట్ టాక్. చరణ్, ఎన్.టి.ఆర్ ఫ్రెండ్ షిప్ ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలుసు. అంతేకాదు రాజమౌళి డైరక్షన్ లో ఇద్దరు కలిసి మల్టీస్టారర్ కూడా చేస్తున్నారు. మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమానే భారీ అంచనాలతో వస్తుంటే ఇక చరణ్ నిర్మాణంలో ఎన్.టి.ఆర్ సినిమా మరింత క్రేజ్ తెచ్చుకుంటుంది.


నిర్మాతగా చరణ్ సూపర్ సక్సెస్ అనిపించుకున్నాడు. ఖైది నంబర్ 150 హిట్ తో పాటుగా సైరా విషయంలో కూడా ఆచి తూచి అడుగులేస్తున్నాడు. మెగా ప్రొడక్షన్ లో నందమూరి హీరో సినిమా అంటే కచ్చితంగా సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. ఇద్దరు స్టార్స్ కలిసి చేసే ఈ సినిమా ఇద్దరి అభిమానులకు క్రేజీ మూవీ అవుతుంది.


అందుకే చరణ్ ఆఫర్ ను ఎన్.టి.ఆర్ చూచాయగా ఓకే అన్నట్టు తెలుస్తుంది. మరి ఈ క్రేజీ మూవీకి దర్శకుడు ఎవరు.. సినిమా కథ ఏంటి.. ఎంత బడ్జెట్ లో రాబోతుంది.. ఈ సినిమాలో చరణ్ కూడా ఉంటాడా అన్నది తెలియాల్సి ఉంది. చరణ్, ఎన్.టి.ఆర్ మల్టీస్టారర్ మూవీకి ధీటుగా ఈ చరణ్, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ మూవీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: