మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఓ పక్క హీరోగా సూపర్ హిట్లు కొడుతూ నిర్మాతగా కొత్త టర్న్ తీసుకున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ లో మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీని నిర్మించిన రాం చరణ్ ఖైది నంబర్ 150తో నిర్మాతగా మొదటి సినిమా సూపర్ హిట్ కొట్టాడు. ఇక ప్రస్తుతం కొణిదెల ప్రొడక్షన్స్ నుండి వస్తున్న రెండో ప్రాజెక్ట్ సైరా నరసింహా రెడ్డి.


సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు రాం చరణ్. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథతో వస్తున్న ఈ సినిమా నిర్మాణంలో చరణ్ కు ప్రముఖ నిర్మాత డివివి దానయ్య సపోర్ట్ ఉందని తెలుస్తుంది. నిర్మాత దానయ్య, చరణ్ కలిసి చాలా సినిమాలు చేశారు.


దానయ్యతో మంచి అండర్ స్టాండింగ్ ఉన్న చరణ్ సైరా బడ్జెట్ విషయంలో దానయ్య సలహాలు తీసుకుంటున్నాడట. అంతేకాదు సైరా సినిమాకు దానయ్య ఫైనాన్స్ ఇస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. బాహుబలి తర్వాత ఎంత బడ్జెట్ మూవీ అయినా సరైన విధంగా తీస్తే సంచలనాలు సృష్టించ వచ్చని ప్రూవ్ అయ్యింది.


అందుకే సైరా సినిమాను ఏమాత్రం కాంప్రమైన్ కాకుండా తెరకెక్కిస్తున్నారట. ఈ మధ్య రిలీజైన సైరా టీజర్ కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. 2019 సమ్మర్ టార్గెట్ తో వస్తున్న సైరా సినిమా చిరంజీవి స్టామినా మరోసారి ప్రూవ్ చేస్తుందని మెగా ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: