తెలుగు ఇండస్ట్రీలో ‘ఏం మాయ చేసావే’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత తెలుగు, తమిళ అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ పొజీషన్లోకి వచ్చింది.  ఇప్పటి వరకు సమంత నటించిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్ గానే నిలిచాయి.  ఈమె కెరీర్ లో డిజాస్టర్లు చాలా తక్కువే అని చెప్పొచ్చు.  ‘ఏం మాయ చేసావే’లో నటించిన తన సహనటుడు అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య తో ప్రేమలో పడి..కొంత కాలం తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.  వీరి వివాహం జరిగి సంవత్సరం కావొస్తున్న నేపథ్యంలో సమంత విహార యాత్రకు ప్లాన్ చేసినట్లు సమాచారం. 


వాస్తవానికి వివాహం జరిగిన తర్వాత అసలు సమంత ఇండస్ట్రికి గుడ్ బాయ్ చెప్పబోతుందని..ఆమె మళ్లీ కనిపించే ఛాన్స్ లేదని అన్నారు.  కానీ పెళ్లైన తర్వాత ఆమె నటించిన 'రంగస్థలం', 'మహానటి', 'యూటర్న్', 'ఇరుంబుదురై' (తెలుగులో అభిమన్యుడు) చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే.  మరోవిచిత్రం ఏంటంటే..రీసెంట్ గా భార్యాభర్తలు నటించిన వేరు వేరు చిత్రాలు.. యూటర్న్, శైలజారెడ్డి అల్లుడు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి.  ఇలాంటి సంఘట తెలుగు ఇండస్ట్రీలో మొదటి సారి జరిగింది.   

తన తరువాతి చిత్రాన్ని భర్త నాగ చైతన్యతో కలసి చేయనున్న సమంత, ఈలోగా చిన్న బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుని, అనుకున్నదే తడవుగా విహారయాత్రకు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్న ఆమె, 'ఫైనల్లీ వెకేషన్' అని వ్యాఖ్యానించింది.  కాగా, చైతూ, సమంత ల వివాహం జరిగి అక్టోబర్ 6 నాటికి సంవత్సరం..ఇదే రోజు ఈ జోడీ  కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ సమయానికి సమంత తన టూర్ ను ముగించుకుని తిరిగి వస్తుందని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: