‘శైలజా రెడ్డి’ పరాజయంతో అంతర్మధనంలోకి వెళ్ళిపోయిన నాగచైతన్య ఆషాక్ నుండి తేరుకోవడానికి చైతు తన భార్య సమంతతో కలిసి ఫారెన్ ట్రిప్ వెళ్ళిపోయాడు. ఆతరువాత విదేశాల నుండి తిరిగి వచ్చి అక్టోబర్ మొదటి వారంలో పెళ్ళి అయిన తరువాత సమంతతో కలిసి నటించబోతున్న లేటెస్ట్ మూవీని ట్రాక్ పైకి తీసుకురాబోతున్నారు.

ఇలాంటి పరిస్థుతులలో నాగచైతన్యకు మరో ఊహించని షాక్ తగిలింది. చైతన్య ప్రస్తుతం నటిస్తున్న ‘సవ్యసాచి’ సినిమా అయినా త్వరలో విడుదలై తన ‘శైలజా రెడ్డి’ గాయాలను మరిచిపోయేలా చేస్తుంది అని భావించాడు. అయితే నవంబర్ లో విడుదల కావలసిన ఈమూవీని రవితేజా కోసం డిసెంబర్ నెలకు త్రోసివేసినట్లు వార్తలు వస్తున్నాయి. 
Savyasachi first look,Naga Chaitanya,Kaali
‘సవ్యసాచి’ నిర్మిస్తున్న మైత్రీమూవీస్ సంస్థ రవితేజ శ్రీనువైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘అమర్ అక్బర్ ఆంథోని’ సినిమాను  నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈసినిమా విడుదల తేదీని అక్టోబర్ 5న అనుకున్నా అదే డేట్ కు విజయ్ దేవరకొండ ‘నోటా’ మరో వారం గ్యాప్ తో ‘అరవింద సమేత’ వస్తున్న నేపధ్యంలో ఈమూవీని డిసెంబర్ కు విడుదల చేద్దామని అనుకున్నారు. 

అయితే లేటెస్ట్ గా ఈమూవీకి రవితేజా దీపావళి సెంటిమెంట్ గుర్తుకు వచ్చినట్లు టాక్. గత సంవత్సరం దీపావళికి రవితేజ ‘రాజా ది గ్రేట్’ విడుదలై సక్సస్ సాధించిన నేపధ్యంలో ఈ సంవత్సరం కూడ అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ నవంబర్ లో రాబోతున్న దీపావళి సీజన్ లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో ‘సవ్యసాచి’ డేట్ ‘అమర్ అక్బర్ ఆంథోని’ కి ఇచ్చి ‘సవ్యసాచి’ ని డిసెంబర్ కు తీసుకువేల్లబోతున్నారు. ఇటీవల నాగచైతన్య సినిమా ఆశించినంత హిట్ కాకపోవడంతో చైతూ సినిమాకు గ్యాప్ ఇచ్చినట్లు అవుతుందని ఆలోచన అని అంటున్నారు. అయితే డిసెంబర్ ను నమ్ముకుని ఇప్పటికే అఖిల్ ‘మిస్టర్ మజ్నూ’ రెడీ అవుతన్న నేపధ్యంలో డిసెంబర్ నెలలో అఖిల్ చైతన్యల వార్ కు  నాగార్జున అంగీకరిస్తాడ అన్నదే ప్రశ్న..


మరింత సమాచారం తెలుసుకోండి: