టాలీవుడ్ లో చిన్ని సినిమాలుగా రిలీజ్ అయిన పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100  పాజిటీవ్ టాక్ తో కలెక్షన్ల పరంగా కనక వర్షం కురిపించాయి.  పెట్టిన పెట్టుబడికి రెండుమూడింతలు ఎక్కువే వచ్చాయి.  ఇక అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 కంటెంట్ పరంగా కాస్త బోల్డ్ అనిపించినా..యూత్ కి బాగా కనెక్ట్ కావడంతో లాభాల బాటలో నడిచాయి.  గీతా ఆర్ట్స్ బ్యానర్ పై పరుశరామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన ‘గీతాగోవిందం’ రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ వచ్చి ఘనవిజయం సాధించింది. 

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా కలెక్షర్లు బాగా రాబట్టాయి.   వసూళ్ల సునామి సృష్టిస్తూ ఏకంగా 120 కోట్ల గ్రాస్ వసూళ్ళని సాధించింది . 60కోట్ల షేర్ వసూల్ కావడంతో అల్లు అరవింద్ తో పాటుగా ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉన్నారు.  కేవలం పన్నెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన గీత గోవిందం 120 కోట్ల వసూళ్ళ ని అరవై కోట్ల లాభాలను తెచ్చిపెట్టడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఆశ్చర్యకరమైన విషయం.  ఈ సినిమాతో పరుశరామ్ కి వరుసగా ఛాన్సలు వస్తున్నాయి. త్వరలో ఆయన గీతాఆర్ట్స్ బ్యానర్ లో మరో సినిమా తీయబోతున్నాడు. 

ఇదే సమయంలో హీరో విజయ్ దేవరకొండకు తెలుగు, తమిళంలో కూడా ఛాన్సులు వస్తున్నాయి.  ‘గీతాగోవిందం’తో అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు రావడంతో ఎంతో సంతోషంలో ఉన్నారట అల్లు అరవిందు. అందుకే వచ్చిన లాభాలలో దర్శకుడికి ముందుగా చెప్పిన మాట ప్రకారం దాదాపు పది కోట్ల ని ఇవ్వడానికి సిద్దం అయ్యాడట. ఇప్పటికే కొంత మొత్తం ఇచ్చాడట ! అలాగే మిగతా సొమ్ము కూడా త్వరలోనే ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ తో ఈ వసూళ్లు సాధ్యం అయ్యాయి కాబట్టి లాభాల్లో వాటా ఇవ్వాలని పరశురాం కు భారీ మొత్తం ఇస్తున్నాడు . 


మరింత సమాచారం తెలుసుకోండి: