మొన్నటి వరకు పవన్ ఫ్యాన్స్..తర్వాత శ్రీరెడ్డి..తర్వాత సాక్షాత్తు శ్రీరామ చంద్రుడు, సీతమ్మలపై తన ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తూ..అవును నాకు వాక్ స్వాతంత్రం ఉంది..ఏదైనా అంటాను..అంటూ అందరి కోపాని గురైన కత్తి మహేష్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  సినీ క్రిటిక్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన బిగ్ బాస్ సీజన్ 1 లో ఇంటి సభ్యుడిగా వెళ్లారు.  ఆ తర్వాత ఎలిమినేట్ అయిన కత్తి మహేష్ పవన్ పై తనదైన వల్గర్ కామెంట్స్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ తో నాలుగు నెలల సోషల్ మీడియా యుద్దం జరిగింది.  ఆ గొడవ పూర్తయిన తర్వాత కాస్టింగ్ కౌచ్ పై ఉద్యమం చేసిన శ్రీరెడ్డి విషయంలో గొడవ జరిగింది. 

ఆ తర్వాత శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఏకంగా ఆరు నెలల పాటు హైదరాబాద్ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.  తాజాగా మరోసారి కత్తి మహేష్ వార్తల్లోకి ఎక్కాడు.  ఈ సారి కత్తి బిగ్ బాస్ లో ఇంటి సభ్యుడైన కౌశల్ ని టార్గెట్ చేసుకున్నాడు.  ఇటీవల హౌస్ లో చోటుచేసుకున్న సంఘటనలను ఆధారం చేసుకొని.. 'కౌశల్ అంతా కోల్పోయాడు.. అతడిని హౌస్ నుండి బయటకి గెంటేయండి' అని పోస్ట్ పెట్టారు కత్తి మహేష్.శనివారం ఎపిసోడ్ లో నాని కౌశల్ ని ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. 'చాలా పేలవమైన, విసుగుపుట్టించే సమాధానం కౌశల్ చెప్పాడు.

బిగ్ బాస్ చరిత్రలోనే అతడు చికాకు తెప్పించే వ్యక్తి' అని చెబుతూ.. తాజాగా మరొక పోస్ట్ పెట్టారు. 'కౌశల్ బిగ్ బాస్ 2 లోనే చాల విసుగు తెప్పించే వ్యక్తి. ఒకవేళ అతను బిగ్ బాస్ 2 టైటిల్ గెలిస్తే మనమెంత ఇడియట్స్ అనే విషయం ప్రూవ్ అవుతుంది' అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తాను బిగ్‌బాస్ ఫైన‌ల్స్‌కు వెళ్లిన దీప్తి నల్లమోతు కోసం తాను కాంపెయిన్ నిర్వహిస్తానని తెలిపారు. 

కౌశల్ ని టార్గెట్ చేస్తూ కత్తి మహేష్ చేసిన కామెంట్స్ పై స్పందించిన ఓ మహిళ.. ''ప్రజలు ఎవరినైతే ఇష్టపడతారో వాళ్లనే మీరెందుకు టార్గెట్ చేస్తారని'' ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ప్రజల ఒపీనియన్ తో తనకు సంబంధం లేదని.. తన దారిలో తాను వెళ్తానని స్పష్టం చేశాడు కత్తి మహేష్.  ఇప్పుడు  క‌త్తి మ‌హేశ్ చేసిన కామెంట్స్‌పై కౌశ‌ల్ ఆర్మీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: