ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలో అత్యధిక సంపన్నుల జాబితాను అలాగే ఇండియాలో సంపన్నుల జాబితా వివరాలను ప్రకటిస్తుంటుంది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న శక్తిమంతమైన సంపన్నుల్లో జాబితాలో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన, ఒలంపిక్ పతక విజేత పీవీ సింధులకు స్థానం లభించింది. వ్యాపారం, వాణిజ్యం, నటన, క్రీడలకు సంబంధించి, ఇండియాకు చెందిన 22 మంది యువ శక్తిమంతుల జాబితాను 'టైకూన్స్ ఆఫ్ టుమారో' పేరిట 'ఫోర్బ్స్ ఇండియా' విడుదల చేసింది.
క్రీడా రంగం నుంచి పీవీ సింధుకు మాత్రమే చోటు దక్కగా, వ్యాపార రంగం నుంచి అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్ పర్సన్ ఉపాసనకు చోటు దక్కింది. క్రీడా రంగంనుంచి సింధుకు మాత్రమే చోటు లభించడం విశేషం. ఈ జాబితాలో, అదానీ పోర్ట్స్ అండ్ సెచ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కరణ్ అదానీ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ ఈడీ అనంత్ గోయెంకా, ఫ్యూచర్ కన్స్యూమర్ ఎండీ ఆశ్ని బియానీ, బిర్లా వారసురాలు, అనన్య బిర్లా తదితరులకు కూడా స్థానం లభించింది.
వీరితో పాటు యస్ బ్యాంక్ సీఈఓ రాణా కపూర్ కుమార్తె రాధా కపూర్, పార్లే ఆగ్రోకు చెందిన నదియా చౌహాన్, లోధా గ్రూప్ నకు చెందిన అభిషేక్ లోధా, క్లియర్ టాక్స్ ఫౌండర్ అర్చిత్ గుప్తాలు కూడా చోటు దక్కించుకున్నారు.