గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  తాజాగా ప్రముఖ వయోలినిస్ట్, మ్యుజిషియన్ బాలభాస్కర్ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన ఒకటిన్నరేళ్ల కుమార్తె తేజస్వి బాల అక్కడికక్కడే మరణించగా.. బాలభాస్కర్, ఆయన భార్య లక్ష్మితో సహా డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యారు. 

తిరువనంతపురం శివారు ప్రాంతం పల్లిప్పురమ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కాగా, ఈ ప్రమాదం . త్రిస్సూర్‌లో ఓ దేవాలయాన్ని దర్శించుకొని తిరిగి వెళ్తున్న సమయంలో అదుపు తప్పిన కారు పక్కనే ఉన్న చెట్టుకు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.   ‘మాంగల్య పల్ల’కు అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. 

ఆ తర్వాత  కెరీర్ లో  ‘మోక్షం’,‘కన్నదిక్కదవతు’ అనే చిత్రాలకు సంగీతం అందించాడు. వయోలినిస్ట్‌గా ఉస్తాద్ జాఖీర్ హుస్సేన్, శివమణి, లూయిస్ బాంక్స్, హరిహరన్, ఫాజల్ ఖురేషి తదితర ప్రముఖులతో కలిసి పనిచేశారు బాలభాస్కర్. 



మరింత సమాచారం తెలుసుకోండి: