తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 2 వస్తుంది.  ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  బిగ్ బాస్ సీజన్ 1 కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హూస్ట్ గా వ్యవహరించారు. అయితే షూటింగ్ బిజీ కారణంగా సెకండ్ సీజన్ లో హోస్ట్ గా వ్యవహరించలేక పోయాడు.  ఎన్టీఆర్ ప్లేస్ లో నాని ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ప్రేక్షకుల నుంచి కొన్ని విమర్శలు వచ్చినా..రాను రాను ఆ విమర్శలు ప్రశంసలుగా మారిపోయాయి.  బిగ్ బాస్ 2 సీజన్ వంద రోజులు పూర్తి చేసుకుంది..నిన్నటి ఎపిసోడ్ 106 కి చేరుకుంది. 

ఈ వారం బిగ్ బాస్ సీజన్ 2 పూర్తి కాబోతుంది..అయితే బిగ్ బాస్ లోకి పదహారు మంద కంటిస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు.  వీరిలో కామన్ మాన్ గా నూతన్ నాయుడు, గణేష్, సంజనలు రావడం ఈ సీజన్ కి ప్రత్యేకత.  ఇప్పటికే 11 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు.  ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో కౌశల్, తనిష్, గీతా మాధురి, సామ్రాట్, దీప్తి నల్లబోతు  ఫైనల్ కి చేరుకున్నారు. 

అయితే బిగ్ బాస్ లో  మొదటి నుంచి కాంట్రవర్సీలు చేస్తూ..ర్యాష్ గా మాట్లాడుతూ..చివరికి ఆపిల్ టాస్క్ లో కౌశల్ పై నోరు జారిన భానుశ్రీ, తేజస్విలు ఎప్పటికీ గుర్తుంటారు.  ప్రస్తుతం వీరిద్దరూ యాంకర్లుగా మారిపోయారు.  భానుశ్రీ ఈటీవీ లో ప్రసారమవుతున్న 'ఢీ 10 ' షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  మా టీవిలో బ్రహ్మానందం మొదటి సారిగా ఓ కామెడీ షో చేయబోతున్న విషయం తెలిసిందే.. ఇందులో తేజస్వి మడివాడ కూడా హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లు అనే వార్తలు వినిపిస్తున్నాయి . 


మరింత సమాచారం తెలుసుకోండి: