కోళీవుడ్ హి మాన్ శరత్కుమార్కి యాక్టింగ్లో ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో అందరికి తెలుసు. తన వారసత్వం పునికి పుచ్చుకున్న ఆమె కూతురు వరలక్ష్మీ శరత్కుమార్ ఫిల్మ్స్క్రీన్ ఎంట్రి ఇచ్చిన తరువాత మొదటగా నెగిటివ్ కామెంట్స్ను తెచ్చుకుంది. శరత్కూమార్ కూతురు వరలక్ష్మి చూడటానికి కొంచెం హైబ్రిట్ బేబిలా కనిపిస్తుందన్నారు. అందులోనూ తన మొదటి మూవీ శింభు సరసన ఎంట్రి ఇచ్చి, మొదటిలోనే ఇద్దరి మధ్య ఎఫైర్ అంటూ గాసిప్ క్రియోట్ అయింది. శింభుతో ఏ హీరోయిన్ తిరిగినా ఇద్దరి మధ్య ఎఫైర్ అనేది చాలా కామన్ పాయింట్ అని కోళీవుడ్ అభిప్రాయం. పాపం వరలక్ష్మి మొదటి ఫిల్మ్ పెద్దగా సక్సెస్ కాకపోయోసరికి, శింభుతో ఎఫైర్ టాపిక్ బాగానే పాపులారిటిని తెచ్చిపెట్టింది.
ఆ తరువాత తన సెకండ్ ఫిల్మ్ కోసం చాలా గ్యాప్ తీసుకుంది. ఎట్ప్రెజెంట్ హీరో విశాల్ సరసన మదగజరాజ అనే మూవీలో నటిస్తుంది. ఈ ఫిల్మ్ తెలుగులో ఎన్.టి.ఆర్ అనే పేరుతో రిలీజ్ అవుతుంది. శింభు,విశాల్ సరసన నటించినా అంతగా పేరు రావడం కష్టం అని లేటుగా తెలుసుకున్న వరలక్ష్మి, ట్రెండ్ మార్చి కన్నడ సూపర్స్టార్ను పట్టేసింది. టాలీవుడ్ 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ను కొల్లగొట్టిన యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ మిర్చి మూవీను, కన్నడలో సుధీప్ రిమేక్ చేస్తున్నాడు. ఆల్రెడీ మిర్చి మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో, ఈ రిమేక్ మూవీ కూడ బ్లాక్ బస్టర్ ఖాయం అని వరలక్ష్మీ ప్లాన్ వేసుకొని సుధీప్ను ట్రాప్లో పడేసింది. దీంతో డైరెక్టర్కు వరలక్ష్మిను హీరోయిన్గా తీసుకోవాలంటూ ఆర్డర్ వేశాడంట. దాంతో అనుష్క నటించిన ప్లాష్బాక్ పాత్రలో వరలక్ష్మిను తీసుకుంటున్నట్టు డైరెక్టర్ వివరించాడు. ఈ మూవీతోనైన వరలక్ష్మి టాలీవుడ్ హీరోలను ఎట్రాక్ట్ చేయటానికి ప్లాన్ వేస్తుందని సమాచారం.