ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా సినిమా ‘అరవింద సమేత’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాకు సంబంధించి ఒక్కో అప్ డేట్ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. మొన్నటి వరకు ఈ సినిమాలో నాలుగు పాటలు మాత్రమే ఉన్నాయని వార్తలు వచ్చాయి. అంతే కాదు ‘అరవింద సమేత’ సంబంధించి జూక్ బాక్స్ లో కూడా నాలుగు పాటలు ఉండటం అందులోనూ రెండు సాలిడ్ సెంటిమెంట్స్ సాంగ్స్ కావడం..ఒకటి హీరోయిన్ ని పొగుడుతూ..రొమాంటిక్ సాంగ్ కావడం..ఇక మిగిలింది ఒక్కటే అదికూడా మాస్ సాంగ్ అయి ఉంటుందా లేదా అన్న అనుమానాలు అభిమానులను కలచి వేశాయి.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ అభిమానులకు శుభ వార్త చెబుతూ..అరవింద సమేతలో మరో హైలెట్ సాంగ్ ఉండబోతుందని అనౌన్స్ మెంట్ వచ్చింది. ‘అరవింద సమేత’ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉండటంతో, ఇటీవల ఆ పాట చిత్రీకరణను కూడా పూర్తి చేశారు. ఈ పాటకి జానీ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించాడు. సెట్స్ లో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలసి దిగిన ఫోటోలను ఈ సందర్భంగా జానీ మాస్టర్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.జానీ మాస్టర్ ట్విట్ తో అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
గతంలో జాని మాస్టర్-ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన డాన్స్ నెంబర్స్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ .. "చాలా గ్యాప్ తరువాత ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ గార్లతో కలిసి పనిచేశాను. ఎన్టీఆర్ కి నేను కంపోజ్ చేసిన సాంగ్ సూపర్ గా వచ్చింది. ఎన్టీఆర్ .. ఈ పాట చూసి త్రివిక్రమ్ హ్యాపీగా ఫీల్ అవడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. మీ అందరి కంటే ఎక్కువగా ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాను" అంటూ ఒక ఫోటోను షేర్ చేశాడు. త్వరలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వివరాలను ప్రకటించనున్నారు.