ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు మహిళలకు రక్షణ లేదని..ఎక్కడ చూసినా కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని వారు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా తనపై అత్యాచారం జరిగిందని రయియిత్రి, ఇండో అమెరికన్ టీవీ యాంకర్‌ పద్మలక్ష్మీ(48) తాజాగా వెల్లడించారు.   పద్మలక్ష్మి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు రక రకాలుగా స్పందించారు.  నీకు అలా అన్యాయం జరిగినపుడు పోలీసులకు, ఇంటి సభ్యులకు ఎందుకు వివరించలేదు..అది నీ సమ్మతమే అని అనొచ్చా అన్న ప్రశ్నలకు..పద్మలక్ష్మి స్పందించారు. 

ఆ విషయంలో నేను స్పందించకపోవడానికి కారణం.. నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు ఓ 23 ఏళ్ల యువకుడితో డేటింగ్ చేశాను..కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొన్న నేను బాగా అలసి పోయిన నా బాయ్ ఫ్రెండ్ రూమ్ లో పడుకున్నాను.  తెల్లవారి చూసే సరికి..నా ప్రైవేట్ పార్ట్స్ వద్ద నొప్పిగా ఉండటంతో..ఏం జరిగిందని అడిగాను.  ఇదంతా కామన్ అని..కొంత టైమ్ తర్వాత సర్ధుకుంటుందని చెప్పాడు.  మత్తుగా నిద్రపోతున్నప్పుడు తెలిసిన వ్యక్తే అఘాయిత్యం చేస్తే ఏం చేయాలో అర్థం కాలేదు. అమ్మకు కూడా విషయం చెప్పలేదు.

మగవారు ఏ తప్పు చేసినా స్త్రీలే శిక్ష అనుభవిస్తున్నారని న్యూయార్క్‌ టైమ్స్‌ మీడియాకు తనకు ఎదురైన చేదు అనుభవాలను వివరించారు. ఇప్పుడు నాకు  32 ఏళ్ల తర్వాత తాను అత్యాచారం జరిగిన విషయాన్ని చెప్పడానికి ఓ కారణం ఉంది..తన కూతురు ధైర్యంగా తనతో విషయాన్ని చెప్పుకునే పరిస్థితిని కల్పించానని ఈ విషయాలు చెప్పానని.. పిల్లలపై అఘాయిత్యాలు జరిగితే వారికి మనం తోడుగా నిలిచి, పోరాడాలంటూ తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: