అగ్ర కథానాయకులు అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకుడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. నవంబర్ 8న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆమిర్ ప్రధాన పాత్రలో.. అమితాబ్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'.
తొలిసారి అమితాబ్-ఆమిర్ కలిసి నటిస్తున్న చిత్రం కావడంలో ఈ సినిమాపై బాలీవుడ్ లో అంచనాలు పెరిగాయి. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కో పాత్రకు సంబంధించి మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆమిర్ (ఫిరంగి). అమితాబ్ (ఖుధాబక్ష్), కత్రినా కైఫ్ (సురైయ్య), ఫాతిమా సనా షేక్(జఫీరా)లకు సంబంధించిన లుక్ లు రిలీజ్ అయ్యాయి.
తాజాగా ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల చేస్తున్నట్లు తెలిపింది.ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో అనువాదం చేసి దీపావళి కానుకగా నవంబర్ 8వ తేదిన రిలీజ్ చేయనున్నారు.. ఈ సందర్భంగా తెలుగు టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది..ఈ టీజర్ లో అమితాబ్, ఆమీర్ ఖాన్ లు తెలుగులో మాట్లాడిన డైలాగ్స్ ఉంచారు.
“మేమిద్దరం కలిసి తొలిసారిగా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమాతో వస్తున్నాం .. ఈ స్పెషల్ ఫిల్మ్ ను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాం .. ఈ దీపావళికి సినిమా హౌస్ లో కలుద్దాం అంటూ ఈ ఇద్దరూ చెప్పడం విశేషం.