టాలీవుడ్ లో మొదటి సారిగా కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘దేవదాస్’ రేపు ప్రేక్షకుల ముందు వస్తుంది.  రష్మిక మందన, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత అశ్వినీదత్ నిర్మించిన ఈ మల్టీస్టారర్‌‌కు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఆద్యంతం వినోదాన్ని పంచే ఈ చిత్రం కోసం నాగార్జున, నాని అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'దేవదాస్' సినిమాతో .. ప్రమోషన్స్ తో కొంతకాలంగా నాగార్జున బిజీగా వున్నారు. 'దేవదాస్' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఆయన అమలతో కలిసి సరదాగా విదేశాలకి వెళుతున్నారు.  తాజాగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ..ఇప్పుడే 'దేవదాస్' సినిమా చూశాను .. విజయం నా పాకెట్ లో వుంది. ఆ ధైర్యంతో .. ఆనందంతోనే హైదరాబాద్ విడిచి ఫ్యామిలీతో వెకేషన్ కి వెళుతున్నాను. ఇక ముందున్నది హాలిడే లైఫే .. థ్యాంక్స్ టూ లెజెండరీ వైజయంతీ మూవీస్ .. అమేజింగ్ నాని .. అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య" అంటూ ట్వీట్ చేశారు.

ఆద్యంతం వినోదాన్ని పంచే ఈ చిత్రం కోసం నాగార్జున, నాని అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఇప్పటికే సమంత .. చైతూ యూరప్ విహారయాత్రలో వున్నారు. అఖిల్ కూడా షూటింగు నిమిత్తం అక్కడే వున్నాడు. వాళ్లతో కలిసి సరదాగా గడపడానికి నాగార్జున - అమల అక్కడికి వెళుతున్నారు.

ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా సినిమాను తెరకెక్కించామని నిర్మాత అశ్వినీదత్ చెప్పకనే చెప్పారు. కాబట్టి ప్రేక్షకులు ఎలాంటి అనుమానాలు లేకుండా ఈ సినిమాకు వెళ్లిపోవచ్చు అని అంటున్నారు నాగ్.   'కృష్ణార్జున యుద్ధం' పరాజయం తరువాత నాని .. 'ఆఫీసర్' ఫ్లాప్ తరువాత నాగార్జున చేసిన ఈ సినిమా పై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు..మరి ఎంత వరకు అలరిస్తారో రేపటితో తేలిపోతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: