త్రివిక్రం డైరక్షన్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా వస్తున్న సినిమా అరవింద సమేత. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా దసరా బరిలో దిగుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.  


ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నాడు. దసరాకి స్పెషల్ గా రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో అదరగొడుతుంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ రాజమౌళి, రాం చరణ్ మల్టీస్టారర్ మూవీ రాబోతుంది. అయితే త్రివిక్రం తర్వాత సినిమాపై క్లరిటా రాలేదు.


అసలైతే విక్టరీ వెంకటేష్ తో త్రివిక్రం సినిమా ఉంటుందని అన్నారు. కాని వెంకటేష్ కన్నా ముందు త్రివిక్రం తో సినిమకు అల్లు అర్జున్ లైన్ లో ఉన్నాడని తెలుస్తుంది. నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ తర్వాత సినిమాపై నిర్ణయం తీసుకోలేదు. విక్రం కె కుమార్ తో సినిమా ఉంటుందని వార్తలొచ్చినా అది క్యాన్సిల్ అయ్యిందని అంటున్నారు.   


అయితే అరవింద సమేత రిలీజ్ తర్వాత ఎలాగు త్రివిక్రం ఖాళీ అవుతాడు కాబట్టి అతనితో సినిమా చేసే ప్లాన్ చేస్తున్నాడట అల్లు అర్జున్. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. అందుకే హ్యాట్రిక్ సినిమా తీస్తే మాత్రం కచ్చితంగా మరింత అంచనాలతో వస్తుందని చెప్పొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: