నాగార్జున నాని కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ ‘దేవదాస్’ టిక్కెట్ల బుకింగ్ ఓపెన్ చేయగానే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయిపోతాయని అనుకున్న అంచనాలకు భిన్నంగా ఉండడంతో ఈమూవీ తొలిరోజు మొదటి షో టాక్ బయటకు రాకుండానే ఈమూవీ బయ్యర్లు విపరీతంగా టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగార్జున నానీల కాంబినేషన్ పై ఉన్న నమ్మకంతో బయ్యర్లు దీనిపై ఏకంగా ముప్పయ్ ఎనిమిది కోట్లు పెట్టేసారు.
అయితే ఈసినిమా విడుదలకి ముందు ఉండాల్సినంత క్రేజ్ ఎందుకు లేదు అనేది ట్రేడ్ వర్గాలకు ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నగా మారింది. ఈమూవీ ఆడియో అంతంత మాత్రంగానే ఉండడంతో పాటు వారం మధ్యలో ఈరోజు గురువారం విడుదల చేయడం కూడ ఈమూవీ ఓపెనింగ్స్ పై భారీ ప్రభావం చూపించే ఆస్కారం ఉంది అని అంటున్నారు.
ఈమూవీకి పాజిటివ్ టాక్ వస్తే పర్వాలేదు కాని లేకుంటే ఓపెనింగ్స్ విషయంలో వెనకపడుతున్న ‘దేవదాస్’ వీకెండ్ కలక్షన్స్ విషయంలో కూడ బాగా నష్టపోయే ఆస్కారం ఉంది అని అంటున్నారు. దీనికితోడు ఈమూవీ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యను టార్గెట్ చేస్తూ నాగార్జున కామెంట్స్ చేయడం ఆతరువాత తనమాట మార్చుకుని ఈమూవీ సక్సస్ ను జేబులో పెట్టుకుని విదేశాలకు వెళ్ళిపోతున్నాను అంటూ నిన్న రాత్రి నాగార్జున తన కుటుంబ సభ్యులతో విదేశాల బాట పట్టడంతో ‘దేవదాస్’ రిజల్ట్ ముందుగానే నాగార్జునకు తెలిసిపోయిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలో నాని పాత్రకి వెయిట్ ఎక్కువ ఇచ్చి నాగార్జున పాత్ర తగ్గించారని అంటున్నారు. అయితే చివరి నిముషంలో అనేక మార్పులు చేర్పులు చేసినా ఈమూవీ పై ఒకేసారి నెగిటివ్ ప్రచారం ఎందుకు ప్రారంభం అయిందో ఎవరికీ తెలియని విషయంగా మారింది. ఇలా అనేక భిన్న స్పందనల నడుమ నేడు విడుదల అవుతున్న ‘దేవదాస్’ రిజల్ట్ ప్రభావం నాగార్జున పై పెద్దగా ఏమాత్రం ఉండకపోయినా ఇప్పటికే ఒక ఫెయిల్యూర్ ను అందుకున్న నానీతో పాటు ఈమూవీ బయ్యర్లకు అగ్ని పరీక్షగా మారింది..