ప్రముఖ కన్నడ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్ దివ్య స్పందన గురించి అందరికీ తెలిసిందే..! రమ్యగా ఈమె పలు హిట్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి భారత ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉంది. అయితే ఈమెపై రాజద్రోహం కేసు నమోదైంది.  ప్రతిసారి సోషల్ మీడియాలో ఏదో ఒక సంచలనం సృష్టించే దివ్యపై రాజద్రోహం కేసు నమోదు కావడం అక్కడ చర్చనీయాంశం అయ్యింది.  లక్నోలోని గోమ్తినగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సెక్షన్ 124-ఏ (రాజద్రోహం), సెక్షన్ 67 కింద ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 


అలా చేయడానికి ముఖ్య కారణం ప్రధాని మోదీని ఉద్దేశించి 'దొంగ' అని ట్వీట్ చేసినందుకే..! దివ్యపై సయ్యద్ రిజ్వాన్ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధానిని తీవ్రంగా అవమానించినందుకే పోలీసులకు ఫిర్యాదు చేశానని రిజ్వాన్ తెలిపారు. ఈ కేసుపై దివ్య స్పందిస్తూ... 'నిజమా.. చాలా మంచిది' అంటూ ట్వీట్ చేశారు. రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంలో మోదీని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాదు భారత దేశంలో ప్రజలు అందరూ చూస్తున్నారని..ప్రధాని చేస్తున్న మోసాలు తగిన బుద్ది చెప్పే రోజులు వస్తున్నాయని అన్నారు.


 గత కొద్దీ రోజులుగా రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్ నేతలు, విపక్షాలు బీజేపీపై ఎదురుదాడికి దిగాయి. రాహుల్‌గాంధీ మాట్లాడుతూ ‘ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు మేము బయటపెట్టిన అంశాలు ఆరంభం మాత్రమే. త్వరలో మొత్తం గుట్టు రట్టు చేస్తాం. దీంతోపాటు ఆర్థిక నేరగాడు మాల్యా దేశం విడిచి పారిపోవడం వెనకున్న అసలు కథను వెల్లడిస్తాం’ అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: