బాలీవుడ్ లో నటి తనుశ్రీ దత్తా చేసిన సంచలన వ్యాఖ్యలు అన్ని వర్గాల నుంచి వ్యతిరేఖత వస్తుంది. `హార్న్ ఒకే ప్లీజ్` సినిమా లో ఓ సాంగ్ షూటింగ్ జరుపుతున్న సమయంలో ప్రముఖ నటుడు నానా పటేకర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని..డ్యాన్స్ చేసే సమయంలో తనను ఎక్కడెక్కడో తాకి లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆరోపణ చేసింది. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కిపడింది. అయితే అందరూ నానాకు మద్దతుగానే నిలిచి తనుశ్రీపై విమర్శలు గుప్పించారు. నానా పటేకర్ ముందు నుంచి దుందుడుకు స్వభావం కలిగిన వ్యక్తి..ఆయన నటనలో కూడా ఎంతో వైవిధ్యం ఉంటుంది.
అయితే రియల్ లైఫ్ లో మాత్రం చాలా సౌమ్యంగా ఉంటారని..సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని..ఎంతో మంది పేద ప్రజలకు సహాయం చేశారని మంచి పేరు ఉంది. దానికి సంబంధించిన వార్తలు కూడా ఆ మద్య సోషల్ మీడియాలో వచ్చాయి. అలాంటి వ్యక్తిపై అది కూడా పది సంవత్సరాల తర్వాత ఆరోపణలు చేయడం ఎంత వరకు న్యాయం అని నెటిజన్లు, అభిమానులు ఫైర్ అవుతున్నారు.
తాజాగా బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కూడా ఈ ఆరోపణలపై స్పందించాడు. తనుశ్రీ చెప్పిన `హార్న్ ఒకే ప్లీజ్` చిత్రానికి గణేష్ ఆచార్య కొరియోగ్రాఫర్గా పనిచేశారు. ఈ సందర్భంగా అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. తనుశ్రీ చేసిన ఆరోపణల్లో వాస్తవాలు కనిపించడం లేదు. పది సంవత్సరాల క్రితం తీసిన సాంగ్ అని..ఆ సాంగ్ తనుశ్రీ చెబతున్నట్టు అది సోలో సాంగ్ కాదు.. డ్యూయెట్.
ఆ రోజు సినిమా సెట్స్లో ఏదో గొడవ జరగడం వల్ల షూటింగ్ మూడు గంటలపాటు నిలిచిపోయింది. అందులో ఎలాంటి అశ్లీల దృశ్యాలు కానీ..అసభ్యకరమైన దృశ్యాలు కానీ లేవని అన్నారు. తనుశ్రీ అరోపించినట్టు నానా ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదు. ఆయన చాలా గౌరవించదగిన వ్యక్తి అని గణేష్ అన్నారు.