తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాగా పెరిగిపోయిందని..కొత్తగా వచ్చే నటీమణులు పక్కలో పడుకుంటే కానీ కొంత మంది ఛాన్స్ ఇవ్వడం లేదని..ఇలా ఎంతో మంది అమ్మాయిలు తమ జీవితాలు బలి చేసుకున్నారని నటి శ్రీరెడ్డి ఆరోపిస్తుంది.  అప్పట్లో కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది.  ఆమెకు మహిళా సంఘలు, విద్యార్థి సంఘాలు కూడా సంఘీభావం పలికాయి.  అయితే ఉద్యమం పీక్ స్టేజ్ లోకి వెళ్లే సమయంలో పవన్ కళ్యాన్ పై ఆయన తల్లిగారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అనూహ్యంగా ఆమె ఉద్యమంపై దెబ్బ పడింది.

అంతే కాదు పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా సాక్షిగా బీభత్సం సృష్టించారు.  దాంతో కొంత కాలంగా ఆమె ఇంటికే పరిమితం అయ్యారు.  ప్రస్తుతం శ్రీరెడ్డి హీరోయిన్ గా తమిళంలో ఓ చిత్రం తెరకెక్కబోతుంది..ప్రస్తుతం ఆమె చెన్నైలో షూటింగ్ లో ఉంది.  ప్రస్తుతం పవన్ కళ్యాన్ జనసేన పార్టీ తరుపున రాజకీయ పోరాట యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన తన ప్రసంగంలో 'ఎవరు ఎవరి దగ్గరో పడుకుంటే దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలట' అంటూ వేసిన వ్యంగాస్త్రం మీద శ్రీరెడ్డి తీవ్రంగా స్పందించారు.

పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను చూసిన ఇన్స్‌సైర్ అయ్యేవారు ఎంతో మంది ఉంటారని, ఒక పబ్లిక్ స్టేజీ మీద ఆయమన అభ్యంతరకరంగా మాట్లాడటం సరైంది కాదు అని ఈ సందర్భంగా శ్రీరెడ్డి తప్పుబట్టారు.  ఒక పొలిటీషియన్ అయి వుండి..ఒక ఆడపిల్ల సహాయం అడిగితే.. ఎవరు ఎవరితోనో పడుకుంటు నేనెందుకు బాధ్యుడిని అవుతాను అనడం, ఆ విషయం చెబుతూ వెటకారం నవ్వులు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కావడం శ్రీరెడ్డి మండి పడ్డారు. గతంలో పవన్ ఫ్యాన్స్ వర్సెస్ శ్రీరెడ్డికి ఎంత వివాదం నడిచింతో అందరికీ తెలిసిందే..ఇప్పుడు మళ్లీ శ్రీరెడ్డి కామెంట్స్ చేయడం మొదలు పెట్టింది..మరి ఈసారి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: