ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాగా పెరిగిపోతుందని కొంత మంది హీరోయిన్లు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు.  ఇక టాలీవుడ్ నటి శ్రీరెడ్డి అయితే ఏకంగా పెద్ద ఉద్యమమే చేసింది.  ఇండస్ట్రీలో తనను దారుణంగా వాడుకున్నారని..కానీ సినిమా ఛాన్స్ లు మాత్రం ఇవ్వలేదని..నాలాంటి అమ్మాయిలు ఎంతో మంది ఇండస్ట్రీలో కొంత మంది దళారుల చేతిలో మోసపోయారని ఆరోపించింది.  తాజాగా ఇప్పుడు బాలీవుడ్ లో నటి తనుశ్రీ దత్తా రోజుకో సంచనల వ్యాఖ్య చేస్తూ సెన్సేషన్ సృష్టిస్తుంది. 

మొన్న ప్రముఖ నటుడు నానా పటేకర్  ‘హారన్ ఓకే ప్లీజ్’ సినిమా సెట్ లో తనను అసభ్యంగా తాకాడని..లైంగికంగా వేధించాడని ఆరోపించింది.  ఈ విషయంపై పలువురు బాలీవుడ్ నటులు నానాపటేకర్ నే వెనుకేసుకొచ్చారు. ఈ విషయం పదేళ్ల క్రితం జరిగితే ఇప్పుడు చెప్పడంలో తనుశ్రీ ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాలో కొరియో గ్రాఫర్ గా పనిచేసిన గణేశ్ ఆచార్య పై కూడా విమర్శలు చేసింది.  దాంతో నానా పటేకర్ ఇలాంటి విషయాల్లో ఎక్కువగా మాట్లాడితే మీడియాలో తప్పున పడతామని..ఈ విషయాన్ని లీగల్ గా అప్రోచ్ అవుతానని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. 

ఇక డ్యాన్స్ మాస్టర్ గణేశ్ ఆచార్య ఆ రోజు వందం మంది కళాకారులు ఉన్నారని..అలాంటి సంఘటన జరిగితే అప్పుడే బహిరంగం అయ్యేదని..ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.  తాజాగా ఇప్పుడు తనుశ్రీ దత్తా మరో బాంబ్ పేల్చింది.  బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సినిమా షూటింగ్ సందర్భంగా తనపట్ల అమర్యాదకరంగా ప్రవర్తించాడనీ, లైంగికంగా వేధించాడని ఆరోపించింది.  చాకొలెట్‌: డీప్‌ డార్క్‌ సీక్రెట్స్‌’ సినిమా షూటింగ్ సందర్భంగా వివేక్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ దత్తా చెప్పింది.

సినిమా షూటింగ్ లో ఓ పాట సందర్భంగా దుస్తులు విప్పి డ్యాన్స్ చేయాల్సిందిగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వేధించాడని ఆవేదన వ్యక్తం చేసింది.  ఆ సమయంలో పక్కనే ఉన్న సునీల్ శెట్టి, ఇర్ఫాన్ ఖాన్ తనను రక్షించారని వెల్లడించింది.  మరోవైపు బాలీవుడ్ లో లైంగిక వేధింపులను బయటపెట్టిన తనుశ్రీకి ఫర్హాన్ అక్తర్, ప్రియాంక చోప్రా, రిచా చద్దా, ట్వింకిల్ ఖన్నా మద్దతుగా నిలిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: