బిగ్ బాస్ సెకండ్ సీజన్ ఫైనల్ వీక్ లో చివరి రెండు రోజులు మాత్రమే ఉన్నాయి. ఐదుగురు హౌజ్ మెట్స్ లో ఒకరిని టైటిల్ విన్నర్ గా ప్రకటించే సమయం వచ్చేసింది. కౌశల్, దీప్తి, గీతా మాధురి, తనీష్, సామ్రాట్ లలో ఎవరు ఫైనల్ విన్నర్ అన్నది కాస్త ఎక్సైటింగ్ గానే ఉంది. అయితే కౌశల్ ఆర్మీ ప్రభావంతో కౌశలే విన్నర్ అన్న సంకేతాలు వస్తున్నాయి.


దీప్తి, గీతా మాధురిలకు ఆ ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఫైనల్ వేడుకకు చీఫ్ గెస్ట్ గా ఎన్.టి.ఆర్ వస్తాడని అన్నారు. బిగ్ బాస్ సీజన్ 1 హోస్ట్ గా చేశాడు కాబట్టి ఎన్.టి.ఆర్ ఫైనల్స్ కు వస్తాడని అనుకున్నారు కాని ఆయన బదులు విక్టరీ వెంకటేష్ బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కు గెస్ట్ గా వస్తున్నాడట.


ఇప్పటికే వెంకటేష్ తో మాట్లాడటం అందుకు ఆయన ఓకే చెప్పడం జరిగిందట. రియాలిటీ షోలలో ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ మొదటి సీజన్ కన్నా ఎక్కువ హిట్ అయ్యిందని చెప్పొచ్చు. ఈసారి హోస్ట్ గా నాని తన బాధ్యత నిర్వర్తించినా హౌజ్ మెట్స్ వల్ల షో రసవత్తరంగా మారింది.


ముఖ్యంగా గత రెండు మూడు వారాలుగా హాట్ హాట్ గా హౌజ్ లోని ఇన్సిడెంట్స్ అందరిని ఆశ్చర్యపరచాయి. కౌశల్ తో ఇంటి సభ్యుల వైరం లాస్ట్ వీక్ తో ముగిసింది. ఈ వారం మొత్తం చాలా సరదాగా సాగింది. ఫైనల్ రేసులో ఉన్న వారిలో టాప్ 3 ఎవరన్నది ఈరోజు డిసైడ్ అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: