ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ అరవింద సమేత మీద ఇప్పడూ ఎక్కడ లేని అంచనాలు నెలకొనివున్నాయి. అయితే అర‌వింద స‌మేత వీర రాఘ‌వ` చిత్రాన్ని అక్టోబ‌ర్ 11న రిలీజ్ చేయ‌డానికి ముహూర్తం పెట్టేసారు. నిన్న‌టి రోజున అధికారికంగా పోస్ట‌ర్ల‌ను కూడా రిలీజ్ చేసి వ‌చ్చేస్తున్నామ‌ని చెప్పేసారు. ఇప్ప‌టికే సినిమాకు ప్ర‌మోష‌న్ లేని నేప‌థ్యంలో ప్రీ రిలీజ్ వేడుకను భారీ ఎత్తున నిర్వ‌హిస్తున్నారు. అక్టోబ‌ర్ 2 గాంధీ జ‌యంతి రోజున అందుకు ముమూర్తం కూడా పెట్టేసారు.


అయితే ఆరోజు మంగ‌ళ‌వారం. ఈ రోజులో సినిమాకు సంబంధించిన ఏ ఫంక్ష‌న్స్ పెద్దగా చేయ‌రు కానీ అర‌వింద మాత్రం ఆరోజే ఫిక్స్ అయ్యాడు. ఆ చిత్ర నిర్మాత కూడా జాత‌కాల‌ను ప‌రిశీలించి మ‌రీ ఈ తేదిని ఫిక్స్ చేయండ‌ని చెప్పిన‌ట్లు తెలిసింది. చూద్దాం ఈ మంగ‌ళ‌వారం సంగ‌తేంటో? అలాగే సినిమా రిలీజ్ అవుతోన్న అక్టోబ‌ర్ 11 కూడా శుక్ర‌వారం కాదు. గురువారం వ‌చ్చింది. జాత‌క రీత్యా ఆరోజు బాగుంటంతోనే ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఆ డేట్ ను పెట్టుకున్నార‌ని తెలుస్తోంది. ఇప్పటికే సినిమా పై భారీ అంచ‌నాలున్నాయి. ఎన్టీఆర్ గ‌త సినిమా రికార్డుల‌ను అర‌వింద్ తిర‌గ‌రాస్తుంద‌ని అభిమానులు బ‌లంగా ఉన్నారు.

Image result for jr ntr aravinda sametha

ప్ర‌స్తుతం సినిమాకు సంబంధించిన ఓ పాట కోసం త్రివిక్ర‌మ్-ఎన్టీఆర్ ఫారెన్ లో ఉన్నారు. వాస్త‌వానికి ఆపాట‌ను ఉంచాలా? వ‌ద్దా ? అనే సందేహాలు ఆ మ‌ధ్య క‌లిగిన‌ట్లు ప్ర‌చారం సాగింది. కానీ ఎన్టీఆర్, అభిమానులు కోసం పెట్టి తీరాల‌ని డిమాండ్ చేయ‌డంతో త‌ప్ప‌క యాడ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో తార‌క్ స‌ర‌స‌న పూజా హెగ్దే న‌టిస్తోంది. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ కు త‌ప్ప‌..మిగ‌తా ఏ ప్ర‌చారానికి తార‌క్ హాజ‌రు కాన‌ట్లు స‌మాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: