మెగా మేనళ్లుడిగా పరిశ్రమలోకి అడుగు పెట్టిన సాయి ధరం తేజ్ హీరోగా కెరియర్ మొదట్లో మెప్పించే సినిమాలు చేయగా రాను రాను ఫ్లాపులను చేస్తున్నాడు. తిక్క నుండి తేజ్ ఐలవ్యూ వరకు సాయి ధరం తేజ్ చేసిన ఆరు సినిమాలు ఫ్లాప్ మూటకట్టుకున్నాయి. అందుకే తేజ్ ఐలవ్యూ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్నాడు.


అమెరికాలో ఫిట్ నెస్ మీద.. తన లుక్ మీద దృష్టి పెట్టిన సాయి ధరం తేజ్ ప్రస్తుతం అది పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చేశాడట. త్వరలోనే కిశోర్ తిరుమల డైరక్షన్ లో సినిమా మొదలు పెడతారని తెలుస్తుంది. చిత్రలహరి టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కథ సినిమా బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది.


మెగా మేనళ్లుడు ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ తో కొత్తగా కనిపిస్తాడట. కచ్చితంగా మెగా ఫ్యాన్స్ కు తేజ్ షాక్ ఇస్తాడని తెలుస్తుంది. నేను శైలజ సినిమాతో దర్శకుడిగా హిట్ అందుకున్న కిశోర్ తిరుమల ఆ తర్వాత ఉన్నది ఒకటే జిందగి సినిమా చేశాడు. మొదటి సినిమా హిట్ అవగా సెకండ్ మూవీ అంచనాలను అందుకోలేదు.


అయితే ఈసారి చిత్రలహరి మాత్రం పక్కా హిట్ సబ్జెక్ట్ తో వస్తుందట. చిత్ర.. లహరి ఇద్దరి అమ్మాయిల మధ్య సాగే ఓ సినిమా ఇండస్ట్రీ కుర్రాడి ప్రేమ కథే చిత్రలహరి సినిమా కథ అని అంటున్నారు. మరి హిట్ కోసం తపించిపోతున్న తేజ్ కు చిత్రలహరి సినిమా అయినా హిట్ అందిస్తుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: