గత కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పెరిగిపోతుందని వార్తలు వస్తూనే ఉన్నాయి.  తెలుగు నటి శ్రీరెడ్డి ఈ విషయంలో ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే.  ఈ మద్య బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా కూడా తనను నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు లైంగికంగా వేధించారని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కోలీవుడు సీనియర్ నటి తనను లైంగికంగా ఓ జర్నలిస్ట్ వేధించాడని  లొంగకుంటే అప్రతిష్ఠ పాలు చేస్తానని బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. 8 నిమిషాల నిడివి ఉన్న ఓ వీడియో క్లిప్‌ను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేసిన ఆమె.. జర్నలిస్టు ప్రకాశ్ ఎం.స్వామి తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని, 2016 నుంచి సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా వేధిస్తున్నాడని కన్నీటి పర్యంతమవుతూ చెప్పింది. 

2016లో హాంకాంగ్‌లో తన భర్త చనిపోయిన తర్వాత తొలిసారి స్వామి తనను కలిశాడని నటి పేర్కొంది.  అయితే తన కొడుకు పాస్ట్ పోర్ట్ విషయంలో సహాయం చేస్తానని పరిచయం చేసుకున్నాడని తెలపడంతో.. అతడితో టచ్‌లో ఉన్నానని తెలిపింది. అయితే, అతడి ప్రవర్తనలో తేడాను గుర్తించానని, ఇటీవల ఆయన తన ఇంటికి సమీపంలోనే ఇంటిని తీసుకుని తనను వేధించడం మొదలుపెట్టాడని వివరించింది. తనను శారీరకంగా తాకడం..తన కోరిక తీర్చమని కోరడం తో తాను విసిగిపోతున్నానని ఆరోపించింది. 

కాగా, ఆమె ఆరోపణలను స్వామి ఖండించాడు. తానెప్పుడూ ఆమె ఇంటికి వెళ్లలేదని పేర్కొన్నాడు. ఆమెకు వ్యతిరేకంగా తానో స్టోరీని సిద్ధం చేస్తున్నానని, ఈ విషయం తెలిసే ఆమె తనపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని వివరించాడు.కాగా, నటిని వేధిస్తున్న ప్రకాశ్ దేశంలోని వివిధ మీడియా సంస్థల్లో పనిచేసినట్టు అతడి ఫేస్‌బుక్ ఖాతా ద్వారా తెలుస్తోంది. అంతేకాదు, ఐక్యరాజ్య సమితికి కరెస్పాండెంట్‌నని, ఎమ్మీ అవార్డులుకు న్యాయమూర్తిగా ఉన్నానని, అమెరికా తమిళ సంఘానికి అధ్యక్షుడినని అందులో రాసుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: