తెలుగు బుల్లితెరపై 113 రోజుల పాటు ప్రేక్షకులను టీవిలకే పరిమితం చేసిన బిగ్ బాస్ సీజన్ 2 రియాల్టీ షో నిన్నటితో ముగిసి పోయింది.  చివరి అంకానికి చేరుకున్న బిగ్ బాస్ ఫైనల్ ఉత్కంఠభరితంగా కొనసాగింది.  నాని నిన్న బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న టీమ్ సభ్యుల ఎలిమినేషన్ కూడా చాలా టెన్షన్ తో ముగిసేలా చేశారు. ఫైనల్ డే సందర్భంగా ఎలిమినేట్ అయిన హౌస్‌మేట్స్ డ్యాన్సులతో సందడి చేశారు. ఫైనల్‌కు చేరిన ఐదుగురిలో సామ్రాట్, దీప్తి నల్లమోతు, ఎలిమినేట్ హోస్ట్ నాని ప్రకటించారు.


 ఇక దీప్తి సునయన, నాని మధ్య సరదా సంభాషణ నవ్వుల పువ్వులు పూయించింది.  హౌస్ గురించి నాని ప్రశ్నిస్తూ.. బయట బాగుందా?, లోపల బాగుందా? అని అడిగగా..లోపలే బాగుందని సునయన చెప్పింది. అయితే అందరూ బయటకు వచ్చేశాక సునయనను లోపలికి పంపుదామంటూ నాని నవ్వాడు.సరేనంటూ ఆమె నవ్వగా, లోపల ఎవరూ ఉండరు కదా అని నాని ప్రశ్నించగా.. ఏం ఫర్వాలేదని సునయన అంది. దీనికి నాని.. తనీశ్ కూడా ఉండడంటూ సరదాగా కామెంట్ చేయడంతో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. 

ఎలిమినేట్ అయిన ఎక్స్ టీమ్ అంతా ఒక చోట కూర్చొని సందడి చేశారు. నందిని తనకు బిగ్ బాస్ ద్వారా తెలుగు పూర్తిగా నేర్చుకున్నానని..సినిమా ఛాన్స్ కూడా వచ్చిందని అన్నారు.  ఇదే క్రమంలో పూజా రామచంద్రన్ కూడా తనకు తెలుగు బాగా వచ్చిందని అన్నారు.   ఇక బిగ్ బాస్ హౌజ్ నుంచి సామ్రాట్, దీప్తి, తనిష్ లు బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ లో పోటీ కోసం ఇద్దరు కౌశల్, గీతా మాధురి మాత్రమే మిగిలారు.  ఉత్సాహంగా సాగిన ఫినాలేలో హౌస్‌ నుంచి గతంలో ఎలిమినేట్ అయిన వారు కూడా సందడి చేశారు.


 ఈ వేడుకలకు నటుడు విక్టరీ వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. విజేతగా కౌశల్‌ను ప్రకటించిన వెంటనే ఆయన అభిమానులుగా చెప్పుకునే ‘కౌశల్ ఆర్మీ’ బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంది.   కౌశల్‌కు చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన గీతామాధురి రన్నరప్‌గా మిగిలిపోయింది. విజేతగా ఎంపికైన కౌశల్ రూ.50 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: