తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ‘సామ్రాట్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని నాగార్జున.  ‘శివ’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్ లో సైతం నాగార్జునకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది.  బాలీవుడ్ లో సైతం నటించిన నాగార్జున రొమాంటిక్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు.  తెలుగు అభిమానులు ఆయనను కింగ్, మన్మధుడు అని పిలుచుకుంటారు.   ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా నటిస్తున్న నాగార్జున నట వారసులుగా అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ లు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.

‘జోష్’ చిత్రంతో అక్కినేని నాగ చైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు హిట్ చిత్రాల్లో నటించాడు.  ఇక అఖిల్ చిత్రంతో హీరో గా పరిచయం అయిన అఖిల్ అక్కినేని ‘హలో’ చిత్రం తర్వాత మిస్టర్ మజ్నూ చిత్రంలో నటిస్తున్నాడు.  ‘ఏం మాయ చేశావే’ చిత్రంలో పరిచయం అయిన సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాగచైతన్యం.  ఈ సంవత్సరం రంగస్థలం, మహానటి, అభిమన్యుడు, యూటర్న్ చిత్రాలతో మంచి జోష్ లో ఉంది సమంత. 

మరోవైను మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం కూడా మంచి సక్సెస్ సాధించి కలెక్షన్లు కూడా బాగా రాబట్టింది.  సమంత-చైతులు విదేశాలకు ఎంజాయ్ చేయడానికి వెళ్లిన విషయం తెలిసిందే.   ఇప్పుడు నాగార్జున నటించిన 'దేవదాస్‌' చిత్రం విడుదలైందే లేదో కుటుంబంతో ఐబిజా వెళ్లిపోయాడు. ప్రస్తుతం అక్కడే సమంత, నాగచైతన్య, అఖిల్‌ అక్కడ ఉన్నారు. 

 ‘దేవదాస్’ ఇచ్చిన విజయంతో ఈ ట్రిప్ ను మరింతగా ఎంజాయ్ చేస్తున్నానని నాగ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.  కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి చేస్తున్న విహారయాత్ర మరింత సరదాగా ఉందని చెప్పిన నాగ్, ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో నాగార్జున, భార్య అమల, నాగ చైతన్య-సమంత జంట, అఖిల్ తదితరులు ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: