తెలుగులో ప్రభాస్ హీరోగా గోపిచంద్ విలన్ గా నటించిన ‘వర్షం’ సినిమాలో ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా..’అంటూ పలకరించింది నిషాకళ్ల బ్యూటీ త్రిష.  ఆ తర్వాత తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది.  త్రిష సినిమాల్లో కన్న ఎన్నో వివాదాస్పద సంఘటనలో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం చూస్తూనే ఉన్నాం.  ఈ మద్య లేడీఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తుంది త్రిష.  అయితే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పదిహేను సంవత్సరాలు దాటుతున్నా..తన చిరకాల వాంఛ సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటించడం. 

ఇప్పటి వరకు తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో నటించిన త్రిష..తాజాగా  కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా 'పేట' సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.   ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా సిమ్రాన్ .. మరో హీరోయిన్ గా త్రిష నటిస్తున్నారు. తాజాగా 'వారణాసి'లో జరుగుతోన్న ఈ సినిమా షూటింగులో త్రిష కూడా జాయిన్ అయింది.  రజనీ .. సిమ్రాన్ కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కొన్ని రోజులుగా చిత్రీకరిస్తూ వస్తున్నారు.

నేను ఎంత నటి అయినా..ఎప్పుటికీ  రజనీకాంత్‌కు అభిమాని. ఆ తర్వాత ఇపుడు కేవలం ఆయన కో స్టార్‌ను. రజనీకాంత్ గారిని ఎన్నో సార్లు కలిసి మాట్లాడాను. ఆయనతో కలిసి పనిచేయడం నాకు తప్పకుండా గొప్ప ఆనందాన్ని ఇస్తుందని మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో చెప్పింది త్రిష. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, అనిరుథ్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూర్చాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేయనున్నారు.  పేటా చిత్రంలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: