‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో భావోద్వేగంతో మాట్లాడిన జూనియర్ మాటలు వెనుక అర్ధాలను వెతికే పనిలో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ‘ఒక నెలరోజుల నుంచి చాలా విషయాలు మనసులో పెట్టుకొన్నాను. మేమిద్దరం మాట్లాడటం మానేశాం. మనిషి బతికి ఉన్నప్పడు వాళ్ల విలువ తెలియదు. మనిషి చనిపోయిన తర్వాత ఆయన విలువ తెలుస్తుంది’ అంటూ ఆవేదనతో జూనియర్ అన్న మాటలలోని అర్ధాలు ఏమిటి అన్న కోణంలో చర్చించుకుంటున్నారు.
మగవాడి పక్కన ఆడది
వాస్తవానికి జూనియర్ కు అతడి తండ్రి హరికృష్ణకు మధ్య చెప్పుకోతగ్గ ఓపెన్ భేదాభిప్రాయాలు లేవు. అదేవిధంగా జూనియర్ కెరియర్ తొలినాళ్ళలో జూనియర్ సినిమాలకు సంబంధించి కానీ అదేవిధంగా అతడి సినిమాల కథలు దర్శకులు ఎంపిక గురించి కానీ హరికృష్ణ బ్రతికి ఉన్న కాలంలో పెద్దగా ఆలోచించిన సందర్భాలు ఓపెన్ గా కనిపించవు. ఒక విధంగా చెప్పాలి అంటే జూనియర్ తనకు తానుగా ఎదిగిన వ్యక్తి. 
ఎప్పుడూ తండ్రి చితికి నిప్పు పెట్టలేదు
ఇలాంటి పరిస్థుతులలో తండ్రిగా హరికృష్ణను జూనియర్ గౌరవించినా హరికృష్ణ ఇమేజ్ తో జూనియర్ ఎదిగిన సందర్భాలు ఏమి కనిపించవు. దీనితో నిన్నటి ఫంక్షన్ లో జూనియర్ తన తండ్రి గురించి మాట్లాడుతూ ‘మేమిద్దరం మాట్లాడటం మానేశాం’ అంటూ జూనియర్ చేసిన కామెంట్స్ హరికృష్ణను ఉద్దేసించి చేసినవా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. 
త్రివిక్రమ్‌తో రిలేషన్
ఈవిషయాల పై క్లారిటీ ఎవరికీ లేకపోయినా హరికృష్ణ జీవించి ఉన్న కాలంలో ‘మనం’ సినిమా విడుదలైన తరువాత జూనియర్ కళ్యాణ్ రామ్ లతో కలిసి హరికృష్ణ తాను కూడ నటిస్తూ ఒక మల్టీ స్టారర్ తీయాలని చాల గట్టి ప్రయత్నాలు చేసాడు. అయితే అప్పట్లో ఆ ప్రయత్నాలకు జూనియర్ నుంచి సపోర్ట్ రాలేదు అన్న వార్తలు ఉన్నాయి. ఈవిషయాలను అన్నీ దృష్టిలో పెట్టుకుని జూనియర్ తన తండ్రి గురించి మాట్లాడుతూ మనిషి జీవించి ఉన్నప్పుడు అతడి విలువ తెలియదు అంటూ ఆవేదనతో కూడిన కామెంట్స్ చేసి ఉంటాడు అంటూ అనేక మంది అభిప్రాయ పడుతున్నారు..    


మరింత సమాచారం తెలుసుకోండి: