తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్.   మహానటులు సీనియర్ ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ తనయుడిగా చిన్నతనంలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్..తర్వాత రాజమళి దర్శకత్వంలో స్టూడెంట్ నెం.1 తో హీరోగా మారారు.  ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు.  ఇక టెంపర్ నుంచి జై లవకుశ వరకు వరుస విజయాలతో దూసుకు వెళ్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ చిత్రంలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. 

ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న హైదరాబాద్ లో జరిగింది.   ఈ సందర్భంగా ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ లు మాట్లాడుతున్నంత సేపు కన్నీటి పర్యంతం అయ్యారు. ముఖ్యంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ..ఇది నా 28వ చిత్రం..ఇప్పటి వరకు నేను నటించిన చిత్రాల్లో చిత్రాల్లో ఎప్పుడూ తండ్రి చితికి నిప్పంటించే పాత్రలను ఏ దర్శకుడూ నాకు ఇవ్వలేదు. కానీ, ఈ సినిమాలో యాధృచ్చికమో ఏమో... మనం అనుకునేది ఒకటైతే, పైవాడు రాసేది మరొకటి" అని ఎన్టీఆర్ భావోద్వేగంతో మాట్లాడాడు.   

మా నాన్నగారు చనిపోయిన విషయం జీర్ణించుకోలేని సమయమే..కానీ ఒక ప్రొడ్యూసర్ మావల్ల బాధపడటం కూడా నాన్నాగారి ఇష్టముండదనే ఉద్దేశ్యంతో నేను షూటింగ్ లో పాల్గొన్నానని అన్నారు.  గత నెల రోజులుగా తనకు అన్నలా, తండ్రిలా, స్నేహితుడిలా త్రివిక్రమ్ శ్రీనివాస్ తోడున్నాడని, తమ ఇద్దరి బంధాన్ని తన తండ్రి చూస్తున్నారని వ్యాఖ్యానించాడు.

తనకు త్రివిక్రమ్ 12 సంవత్సరాలుగా తెలుసునని, ఆయనలో ఇంతకాలం ఓ స్నేహితుడిని, దర్శకుడిని చూశానని, ఈ సినిమా సందర్భంగా ఆయనలో ఓ ఆత్మబంధువుని చూశానని తెలిపాడు. ఒక గొప్ప చిత్రాన్ని నాకు ఇచ్చి, జీవితం విలువ తెలిసేంత పరిపక్వత రావడానికే దేవుడు ఇప్పుడు త్రివిక్రమ్‌ తో ఈ సినిమా చేయించాడేమో  అని అన్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: