‘అరవింద సమేత’ లో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డే నిన్న జరిగిన ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు రాకపోవడంతో జూనియర్ అభిమానులు ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఈరోజు ఉదయం నుండి మాటల దాడి మొదలు పెట్టారు. దీనితో ఎలర్ట్ అయిన పూజ తాను ‘అరవింద సమేత’ ఫంక్షన్ కు ఎందుకు రాలేకపోయిందో వివరిస్తూ ట్విట్ చేసింది. 
Aravindha Sametha
ప్రస్తుతం పూజ బాలీవుడ్ సినిమాకు సంబంధించి రాజస్థాన్ ప్రాంతంలోని జైసల్మేర్ లో ఉన్నానని అక్కడ నుండి విమాన సర్వీసులు చాల తక్కువగా ఉండటంతో ‘అరవింద సమేత’ ఫంక్షన్ కు రాలేకపోయాను అంటూ ట్విట్ చేసి జూనియర్ అభిమానుల కోపాన్ని తగ్గించడానికి ప్రయత్నించింది. అంతేకాదు తాను నిన్న రాత్రి ‘అరవింద సమేత’ ఫంక్షన్ లైవ్ కార్యక్రమాన్ని తాను టివీలో చూసాను అని చెపుతూ అయితే జూనియర్ బాధతో మాట్లాడిన మాటలలో భావం అర్ధం అయింది కానీ భాష పూర్తిగా అర్ధం కాలేదు అంటూ కామెంట్స్ చేసింది. 
Aravinda Sametha Movie New Posters
అయితే ఎన్టీఆర్ ప్రసంగంలోని ప్రతి మాట గుండె లోతుల్లోనుంచి వచ్చినట్లుగా అనిపించినా తనకు పూర్తిగా తెలుగు రాకపోవడంతో జూనియర్ ప్రస్తావించిన చాల విషయాలు తనకు అర్ధం కాలేదు అని అంటోంది ఈ కన్నడ బ్యూటీ. వాస్తవానికి ఈమె తెలుగులో టాప్ హీరోలతో నటించిన చాల సినిమాలు ఫెయిల్ అయినా త్రివిక్రమ్ ఆ ఫెయిల్యూర్ సెంటిమెంట్ ను పరిగణలోకి తీసుకోకుండా మరో భారీ అవకాశం ఇచ్చాడు. 
Pooja Hegde says, Jr NTR was missed in this one
ఈమూవీలో ఈమె కేవలం గ్లామర్ డాల్ గా కనిపించకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటించాను అని చెపుతోంది. దీనితో ఈమూవీ విజయం జూనియర్ త్రివిక్రమ్ లతో సమానంగా పూజ హెగ్డేకు కూడ చాల కీలకంగా మారింది. అనేక వ్యతిరేక సెంటిమెంట్స్ ఎదుర్కొంటూ విడుదల అవుతున్న ‘అరవింద సమేత’ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇప్పటికే ఎందరో టాప్ హీరోలతో నటిస్తున్న ఈ డస్కీ బ్యూటీ టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ రేసులో ముందు వరసలో ఉండటం ఖాయం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: