తెలుగు ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’బయోపిక్. ప్రముఖ దర్శకులు క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నట ప్రస్థానం..రాజకీయ ప్రస్థానం చూపించబోతున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని కీలక ఘట్టాలు రీసెంట్ గా షూట్ చేసినట్లు సమాచారం.
అంతే కాదు ఇందులో ముఖ్యమైన పాత్రలు ఎన్టీఆర్ గా బాలకృష్ణ, ఏఎన్ఆర్ గా సుమంత్, సీఎం చంద్రబాబుగా రానా కు సంబంధించిన ఫస్ట్ లుక్ రీలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ సతీమణిగా విద్యాబాలన్ నటిస్తున్నారు. ఎస్వీఆర్ గా నాగబాబు నటిస్తుండగా..శ్రీదేవి పాత్రలో రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నట్లు సమాచారం.
ఇక ‘ఎన్టీఆర్’ బయోపిక్ నుంచి నేడు (గురువారం) మరో సర్ప్రైజ్ రాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ ఉదయం 9:35 గంటలకు ఆ సర్ప్రైజ్ను బయటపెట్టనున్నట్టు తెలిపింది. ఈ తాజా వార్త అందరిలోనూ ఉత్కంఠ రేపింది.