ఎన్టీఆర్ అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ చాలా ఎమోషనల్ అయ్యి మాట్లాడినాడు అయితే ఒక్క మాట కూడా తన బాబాయి గురించి చెప్పింది లేదు. అయితే లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ కారణంగా బాలయ్యకు హరికృష్ణ ఫ్యామిలీకి మధ్య కూడా దూరం పెరిగిందని గుసగుసలు వినిపించాయి. వాటికి తగినట్లుగానే హరికృష్ణకు, ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీలో ప్రయారిటీ అంతంతమాత్రమై పోయింది. రాను రాను బాబాయ్ అబ్బాయ్ ల నడుమ గ్యాప్ పెరిగిందని ఇండస్ట్రీలో, పొలిటికల్ సర్కిళ్లలో తరచు వినిపిస్తూనే వచ్చింది.

ఎన్టీఆర్-బాలయ్య నో ప్యాచప్?

బాబాయ్ చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ గురించి కానీ, లుక్కుల గురించి కానీ ఎన్టీఆర్ ఒక్క ట్వీట్ కూడా ఎప్పుడూ వేయలేదు. సరే, ఇంతలో అనుకోని దుర్ఘటన జరిగిపోయింది. నందమూరి హరికృష్ణ ప్రమాదంలో మరణించారు. వెంటనే చంద్రబాబునాయుడు, లోకేష్, బాలయ్య అందరూ ఎన్టీఆర్ తో కలిసారు. దాదాపు వారంరోజులు కలిసే వున్నారు. వాళ్లంతా కలిసి ముచ్చటించుకుంటున్న వీడియోలు బయటకు వచ్చాయి.

Image result for aravinda sametha pre release event

దీంతో ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా అరవింద సమేత వీరరాఘవ ప్రీరిలీజ్ ఫంక్షన్ కు బాబాయ్ బాలయ్య చీఫ్ గెస్ట్ గా వస్తారని వార్తలు వినవచ్చాయి. అంతేకాదు, ఫంక్షన్ ఆంధ్రలో వుండే అవకాశం వుందనీ వార్తలు వచ్చాయి. కానీ మరి ఏమయిందో? పరిస్థితి మళ్లీ మామూలు అయినట్లు తెలుస్తోంది. అరవింద అడియో పంక్షన్ లో విపరీతంగా ఎమోషనల్ అయిన ఎన్టీఆర్ తన ప్రసంగంలో పొరపాటున కూడా బాలయ్య పేరు కానీ బాబు పేరు కానీ ప్రస్తావించలేదు. తండ్రి మరణం తరువాత దర్శకుడు త్రివిక్రమ్ నే తనకు అన్నివిధాలా అండగా వున్నారని, సోల్ మేట్ అని చెప్పుకువచ్చారు. బాలయ్య బాబాయ్, చంద్రం మామ గురించి మాట మాత్రానికైనా ప్రస్తావించలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: